Sri Lanka PM: శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే
తీవ్ర సంక్షోభంతో కల్లోలమవుతోన్న శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే (73) బాధ్యతలు చేపట్టారు.
ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు గొటబాయ
కొలంబో: తీవ్ర సంక్షోభంతో కల్లోలమవుతోన్న శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే (73) బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో మరో వారంలోనే నూతన కేబినెట్ను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తీవ్ర ఆందోళనలతో అట్టుడుకుతోన్న శ్రీలంకలో నిరసన జ్వాలల దెబ్బకు ప్రధానమంత్రి మహింద రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. సీనియర్ నేత విక్రమ సింఘేను ప్రధానమంత్రిగా నియమించేందుకు మొగ్గుచూపారు. బుధవారం నాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన గొటబాయ.. పార్లమెంట్లో మెజార్టీ, ప్రజల విశ్వాసం పొందిన కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని విక్రమ సింఘేతో చర్చలు జరిపిన అనంతరం దేశ ప్రధానిగా ఆయనకు పగ్గాలు అప్పజెప్పారు. మరోవైపు అధ్యక్ష అధికారాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నానన్న గొటబాయ రాజపక్స.. కొత్త మంత్రివర్గంలో తమ కుటుంబీకులెవరూ ఉండబోరని హామీ ఇచ్చారు.
రణిల్ విక్రమ సింఘే.. ఐదోసారి ప్రధాని బాధ్యతల్లోకి..
యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)కి చెందిన రణిల్ విక్రమ సింఘే శ్రీలంకకు పలు దఫాల్లో ఇప్పటివరకు మొత్తం నాలుగుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించారు. తాజాగా అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు శ్రీలంక ప్రధానిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. 2018లో అధ్యక్షుడిగా ఉన్న మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించినప్పటికీ తిరిగి రెండు నెలలకే మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. దేశంలో పురాతనమైన పార్టీగా యూఎన్పీకి పేరున్నప్పటికీ క్రితం (2020) సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కేవలం ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. అయితే, మొత్తం ఓట్ల ఆధారంగా ఆ పార్టీకి కేటాయించిన ఒక సీటుతో విక్రమ సింఘే పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
ఇదివరకు నాలుగుసార్లు ప్రధానిగా, ఆయా ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రణిల్కు దూరదృష్టి గల విధానాలతో ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలరనే పేరుంది. అంతేకాకుండా అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలోనూ చతురత కనబరిచే నేతగానూ ప్రజామోదం ఉంది. దీంతో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో అధికార పార్టీ ఎస్ఎల్పీపీ, ప్రతిపక్ష ఎస్జేబీకి చెందిన కొందరితోపాటు ఇతర పార్టీల సభ్యులు విక్రమ సింఘేకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో ఐదోసారి శ్రీలంక పగ్గాలను చేపట్టిన నేతగా విక్రమ సింఘే కీర్తి సొంతం చేసుకున్నారు.
విక్రమసింఘే గురించి మరిన్ని..
* 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘే గత 45ఏళ్లుగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు
* వివిధ దేశాలతో మంచి సంబంధాలు ఉండడంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో సమర్థ నేతగా పేరు తెచ్చుకున్నారు.
* న్యాయవాది అయిన విక్రమ సింఘే.. 1977లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ద్వీపదేశం శ్రీలంక రాజకీయాల్లోనే అత్యంత కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు.
* 1993లో తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన రణిల్.. వివిధ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వశాఖకు నేతృత్వం వహించారు.
* 1993 నుంచి 1994, 2001-2004, 2015-18, 2018-19లో మొత్తం నాలుగు దఫాల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
* నాయకత్వ సంక్షోభంతో 2020లో తన పార్టీలో చీలిక రావడంతో రణిల్ పార్టీ రెండుగా విడిపోయింది. అనంతరం యూఎన్పీ అధినేతగా రణిల్ కొనసాగుతున్నారు.
* 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో వచ్చిన విబేధాలు విక్రమ సింఘే ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అదే సమయంలో 2019లో ఈస్టర్ రోజున జరిగిన దాడిలో 260మంది ప్రాణాలు కోల్పోవడం రణిల్ ప్రభుత్వానికి మరింత ప్రతికూలంగా మారింది. 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విక్రమ సింఘే పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి