astronaut : ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి సోయుజ్ ఎంఎస్-23 (Soyuz MS-23) స్పేస్ క్రాఫ్ట్లో బయలుదేరిన ముగ్గురు వ్యోమగాములు (astronaut) కజక్స్థాన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
Image: Space_Station
ఇంటర్నెట్ డెస్క్ : నాసా (Nasa) వ్యోమగామి ఫ్రాంక్ రూబియో, రష్యా వ్యోమగాములు సెర్గే ప్రొకోపీవ్, దిమిత్రి పెటెలిన్లు తమ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకొని భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి సోయుజ్ ఎంఎస్-23 (Soyuz MS-23) స్పేస్ క్రాఫ్ట్లో బయలుదేరిన వీరు కజక్స్థాన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ ప్రయాణం 157.4 మిలియన్ మైళ్లు. వాస్తవానికి ఈ మిషన్ ఆరు నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే, 2022 డిసెంబరులో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్లో ఊహించని లీక్ చోటు చేసుకోవడంతో గడువు పొడిగించారు. దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు గడపాల్సి వచ్చింది.
రాకెట్ లాంఛర్ శకలంతో ఆడుతుంటే పేలిపోయి.. చిన్నారులు మృతి
అంతకముందు నాసా వ్యోమగామి మార్క్ వాన్ డే హే 355 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. రూబియో సెప్టెంబరు 2022 సెప్టెంబరు 21న అంతరిక్షంలోకి వెళ్లారు. 2023 సెప్టెంబరు 11న ఆయన మార్క్ అంతరిక్షయాన రికార్డును బద్ధలుగొట్టారు. ఇక అంతరిక్ష కేంద్రంలో గడిపిన సమయంలో రూబియో అనేక శాస్త్రీయ పరిశోధనలకు సహకరించారు. భవిష్యత్తులో అనేక మిషన్లను చేపట్టడానికి నాసా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పరిశోధనల సమాచారం ఎంతో విలువైనదిగా మారింది.
నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాలనే విషయం తెలిసినా రూబియో, ప్రొకోపీవ్, దిమిత్రిలు వెనక్కి తగ్గలేదు. సవాళ్లను ఎదుర్కొంటూనే తమ విధులు నిర్వహించారు. వారి అంకితభావం అంతరిక్షంలో మానవ జీవితంపై అవగాహనను మెరుగుపరచడమే కాకుండా.. భవిష్యత్ వ్యోమగాములకు ఓ మార్గదర్శకంగా నిలిచిందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
Israel-Hamas: ఒకవైపు బందీల విడుదల కొనసాగుతుండగా.. తమ చెరలో ఉన్న ఓ చిన్నారి మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. -
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయ వ్యక్తిపై తాజాగా అమెరికా(USA) అభియోగాలు మోపింది. -
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
Henry Kissinger: ప్రముఖ దౌత్య వేత్త అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..