ఆ రెండు ద్వీపాలనూ వదలని మహమ్మారి.. తొలిసారి లాక్డౌన్!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొమ్ములు విదిలిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారితో అమెరికా, బ్రిటన్, భారత్ తదితర దేశాలు తీవ్ర పరిణామాలూ ఎదుర్కొన్నాయి. అయితే, రెండేళ్లుగా ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని...
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొమ్ములు విదిలిస్తోంది. ఈ మహమ్మారితో అమెరికా, బ్రిటన్, భారత్ తదితర దేశాలు తీవ్ర పరిణామాలూ ఎదుర్కొన్నాయి. అయితే, రెండేళ్లుగా ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని రెండు ద్వీప దేశాలు.. కిరిబాటి, సమోమాల్లో తాజాగా తొలిసారి లాక్డౌన్ విధించడం గమనార్హం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో పెద్దఎత్తున కరోనా కేసులు వెలుగుచూడటమే ఇందుకు కారణం. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు.
డబ్ల్యూహెచ్వో వివరాల ప్రకారం.. దాదాపు 1.20 లక్షల జనాభా ఉన్న కిరిబాటీలో మహమ్మారి ప్రారంభం నుంచి ఈ నెల వరకు ఒక్క కేసూ నమోదు కాలేదు. కానీ, ఇటీవల అంతర్జాతీయ సరిహద్దులు తెరిచాక.. ఫిజీ నుంచి వచ్చిన ఓ విమానంలో ఏకంగా 36 మందికి పాజిటివ్గా తేలింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్తో నలుగురికి వైరస్ సోకింది. దీంతో అధికారులు.. శనివారం నుంచి స్థానికంగా లాక్డౌన్ విధించారు. మరోవైపు దేశ జనాభాలో ఇప్పటివరకు కేవలం 34 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
సమోవాలోనూ ఇదివరకు కేవలం రెండు కేసులు మాత్రమే బయటపడ్డాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో స్థానికంగా శనివారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు లాక్డౌన్ విధించినట్లు ప్రధాన మంత్రి ఫియామ్ నవోమి మాతాఫా చెప్పారు. వారికి ఒమిక్రాన్ సోకినట్లు భావిస్తున్నామన్నారు. కరోనా సోకినవారితో సన్నిహితంగా ఉన్న మరో తొమ్మిది మందిని ఐసొలేషన్లో ఉంచినట్లు వెల్లడించారు. సమోవా జనాభా 1.98 లక్షలు కాగా, 62 శాతం మంది టీకాలు వేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
నడుం నొప్పి.. కుంగుబాటు.. తలనొప్పి
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!