Sleep loss: అధిక ఉష్ణోగ్రతలతో నిద్రపై ప్రతికూల ప్రభావం! తాజా అధ్యయనంలో వెల్లడి
వాతావరణ మార్పులు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తోన్న విషయం తెలిసిందే. మన చుట్టూ ఉష్ణోగ్రతలూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల నిద్రపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని...
ఇంటర్నెట్ డెస్క్: వాతావరణ మార్పులు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తోన్న విషయం తెలిసిందే. మన చుట్టూ ఉష్ణోగ్రతలూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల నిద్రపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘వన్ ఎర్త్’ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. 2099 నాటికి ప్రతి వ్యక్తి ఏడాదికి 50 నుంచి 58 గంటల నిద్రను కోల్పోయే ప్రమాదం ఉంది. పేద దేశాల ప్రజలతోపాటు వృద్ధులు, మహిళల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దీంతో అనేక శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ అధ్యయనం కోసం.. 68 దేశాల్లో 47 వేలకుపైగా ప్రజలకు యాక్సిలరోమీటర్ ఆధారిత స్లీప్-ట్రాకింగ్ రిస్ట్బ్యాండ్లు అందజేసి పరీక్షించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భవిష్యత్తులో మరణాలతోపాటు ఆసుత్రుల్లో చేరికలు పెరుగుతాయని, మనుషుల పనితీరుపై ప్రభావం పడుతుందని ఆయా అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ.. మానవ జీవ, ప్రవర్తనా విధానాలపై వాటి ప్రభావం విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు. ‘వేడి వాతావరణం కారణంగా.. పెద్దలు ఆలస్యంగా నిద్రపోతారు. ముందుగానే మేల్కొంటారు. సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నిద్రను తగ్గిస్తాయని మా అధ్యయనం మొదటిసారి తగు సాక్ష్యాలు అందిస్తోంది’ అని కోపెన్హెగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకర్త కెల్టన్ మైనర్ చెప్పారు.
‘సాధారణంగా మన శరీరాలు స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంటాయి. అయితే, రాత్రి వేళల్లో మనకు తెలియకుండానే కొంత వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీంతో శరీరం కాస్త చల్లబడి, నిద్రపడుతుంది. అయితే, ఇందుకోసం.. చుట్టూ వాతావరణం మన శరీర ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉండాలి. కానీ, అధిక వేడి కారణంగా ఇది కష్టమవుతోంది. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల రాత్రుల్లో నిద్ర సమయం సగటున 14 నిమిషాలు తగ్గుతుంది. వేడి పెరిగే కొద్దీ నిద్ర సమయం కూడా ఏడు గంటల కంటే తక్కువకు పడిపోయే అవకాశాలు అధికం. భిన్న కాలాలు, ప్రదేశాలు, వాతావరణ పరిస్థితుల్లోనూ.. అధిక ఉష్ణోగ్రతలు నిద్రను దెబ్బతీస్తాయి. టెంపరేచర్ ఎక్కువైనకొద్ది నిద్ర నష్టం కూడా పెరుగుతుంది’ అని మైనర్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం