10 డౌనింగ్ స్ట్రీట్కు రిషి.. ఆయనకున్న విలాస భవంతులెన్నో తెలుసా..?
యూకే కొత్త ప్రధాని రిషి అధికారిక నివాసంలోకి మారనున్నారు. అయితే ఆయనకు పలు విలాస భవంతులున్నాయి.
లండన్: కోటీశ్వరుడైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తనకున్న ఎన్నో విలాసవంతమైన భవనాలను వదిలి.. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అంతకు ముందు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన అందులోనే నివసించారు. ఈ విషయాన్ని ఆ సెక్రటరీ ధ్రువీకరించారు. దీనికంటే 11 డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ విశాలంగా ఉంటుంది. కానీ రుషి మాత్రం 10లో ఉండాలనుకుంటున్నారు. ఎందుకు ఆయన దాన్నే ఎంచుకున్నారని అడగ్గా.. ‘వారక్కడ అంతకుముందు సంతోషంగా ఉన్నారు ’ అని ప్రతినిధి సమాధానమిచ్చారు.
రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి.. దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె. ఆమె కూడా ఆ సంస్థలో వాటాదారు. దాంతో రిషి, అక్షత ఇద్దరి ఆస్తుల విలువ కలిపి 730 మిలియన్ల పౌండ్లుగా ఉంది. వారికి బ్రిటన్, విదేశాల్లో కలిపి నాలుగు ఇళ్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ 15 మిలియన్ల పౌండ్లు.
అందులో న్యూయార్క్షైర్లో ఉన్న భవంతి విలువ 6.6 మిలియన్ల పౌండ్లు. ఇది నాలుగు అంతస్తుల్లో ఉంది. సునాక్ కుటుంబం వారాంతాలు ఇక్కడికే వెళ్తుంది. అలాగే రిషి నియోజకవర్గం అయిన రిచ్మండ్లోని కిర్బీ సిగ్స్టన్లో గ్రేడ్-2 లిస్టెడ్ జార్జియన్ మానర్ హౌస్ ఉంది. ఇది వీరి ఇల్లు. దీని విలువ రెండు మిలియన్ల పౌండ్లు. అలాగే యూఎస్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటా మోనికా ప్రాంతంలో పెంట్హౌస్ అపార్ట్మెంట్ ఉంది. బ్రిటన్లో ఇళ్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు వివాహం తర్వాత రిషి జంట ఇక్కడే ఉన్నారట. ఇంకా వీరికి లండన్లోని ఒక ఫ్లాట్ ఉంది. ఇది 2001లో రిషి ఉద్యోగం చేస్తున్న సమయంలో కొనుగోలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ