Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో వెనకబడ్డ రిషి సునక్!
బ్రిటన్లో అక్కడి ఆర్థిక మంత్రి రిషి సునక్ పేరు ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలుస్తోంది. భారత మూలాలున్న ఈ వ్యక్తి కొన్ని వారాల క్రితం ప్రధానమంత్రి రేసులో ముందున్నట్లు అక్కడి సర్వేలు చెప్పాయి....
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్లో అక్కడి ఆర్థిక మంత్రి రిషి సునక్ పేరు ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలుస్తోంది. భారత మూలాలున్న ఈ వ్యక్తి కొన్ని వారాల క్రితం ప్రధానమంత్రి రేసులో ముందున్నట్లు అక్కడి సర్వేలు చెప్పాయి. కానీ, ఇప్పుడు ఆ ప్రతిష్ఠ మసకబారినట్లు ఆన్లైన్ పోల్స్ చెబుతున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.
ఉద్దీపనల ఉపసంహరణ..
కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సునక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వావాదాస్పదంగా మారాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించిన ఆయన.. తర్వాత ఖజానాపై భారం పడకుండా కొన్ని వర్గాలపై పన్నులు పెంచారు. దీనికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో నిత్యావసర వస్తువులు పెరిగి పోయాయి. ఓవైపు పన్నుల పెంపు.. మరోవైపు ధరల పెరుగుదల ప్రజల్లో అసహనానికి కారణమైంది. దీనతంటికీ రిషి సునక్ నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.
సతీమణి పన్ను వివాదం..
ఇటీవల ఆయన సతీమణి అక్షతా మూర్తిపై వస్తున్న పన్ను ఎగవేత ఆరోపణలూ సునక్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షత బ్రిటన్లో ‘నాన్-డొమిసైల్’ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్లో ‘నాన్-డొమిసైల్’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే తాను చట్టప్రకారం బ్రిటన్లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి తెలిపారు. సునక్ సన్నిహితులు మాత్రం ఇవి రాజకీయ ప్రేరిత ఆరోపణలు అంటున్నారు. భవిష్యత్తులో సునక్ బ్రిటన్ ప్రధాని కావచ్చొన్న అంచనాల నేపథ్యంలోనే రాజకీయంగా ఆయన ఎదుగుదలను అడ్డుకొనే కుట్రలో భాగమే ఈ విమర్శలని వారు చెబుతున్నారు.
పాండమిక్తో పాపులారిటీ..
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్ల పౌండ్లు విలువ చేసే అత్యవసర పథకాలను సునక్ ప్రకటించారు. దీంతో పాటు పార్లమెంటులో ఆయన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అదే సమయంలో ప్రధాని బోరిస్ జాన్సన్పై వచ్చిన విమర్శలూ సునక్ ప్రతిష్ఠ పెరగడానికి ఉపయోగపడ్డాయి. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో బోరిస్ తన సహచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా విందులో మునిగి తేలారన్న విమర్శలు బ్రిటన్ రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒకవేళ పదవి నుంచి బోరిస్ దిగిపోవాల్సి వస్తే.. తదుపరి పీఎం ఎవరనే దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీంతో రిషి సునకే అందుకు తగిన వ్యక్తి అని ఆన్లైన్ సర్వేలు అప్పట్లో కోడై కూసాయి. దీనిపై బెట్టింగులు కూడా జోరుగా సాగాయి.
కానీ, తర్వాత రోజుల్లో బోరిస్ క్షమాపణలు చెప్పడం, ఉద్దీపనలను సునక్ ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు వచ్చి పడ్డాయి. దీంతో రిషి ప్రతిష్ఠ సైతం క్రమంగా మసకబారుతూ వచ్చింది. తాజా పన్ను వివాదం దాన్ని మరింత దిగజార్చింది. ఓ ప్రముఖ ఆన్లైన్ సర్వే ప్రకారం.. నెల క్రితం 34 శాతం మంది ఆయన్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు అలాంటి వారి సంఖ్య 12 శాతానికి పడిపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..