Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో కీలక నిర్ణయం!
మరో రెండేళ్లపాటు విదేశీసాయాన్ని నిలిపివేయాలని బ్రిటన్ యోచిస్తున్నట్లు టెలిగ్రాప్ పత్రిక వెల్లడించింది. బ్రిటన్లోని ఆర్థిక పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
లండన్: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఇప్పటికే స్పష్టం చేసిన బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని భావిస్తున్నట్లు టెలిగ్రాఫ్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. మొత్తం జాతీయ ఆదాయంలో 0.5శాతం మొత్తాన్ని బ్రిటన్ విదేశీసాయం కోసం వినియోగిస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూకే.. రెండేళ్ల క్రితం విదేశీ సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. తాజాగా రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని మరో రెండేళ్లపాటు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘‘విదేశీ సాయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రధానితోపాటు ఛాన్సలర్ ఉమ్మడిగా తీసుకుంటారని యూకే కోశాగారం అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
కరోనా విజృంభణకు ముందు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో రిషి సునాక్ ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే 2024-2025 నాటికి విదేశీసాయాన్ని 0.7శాతానికి పెంచుతామని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కానీ, తాజాగా 2026-2027 వరకు విదేశీసాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని రిషి ప్రభుత్వం యోచిస్తున్నట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. బ్రిటన్ తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేవలం విదేశీ సాయాన్ని నిలిపివేయడమే కాకుండా ఇతర అంశాల్లోనూ మరో మూడేళ్లపాటు కోతలు పడే అవకాశముందని రాసుకొచ్చింది. దేశంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఆహారం, ఇంధనం, గృహకొనుగోలుపై పన్ను తగ్గింపును రద్దు చేస్తూ బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ