Rishi Sunak: ప్రపంచ దేశాలను ఏలుతున్న భారత సంతతి బిడ్డలు వీరే..!
రిషి సునాక్(Rishi sunak) ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో భారత్ మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టే ఆరో దేశంగా బ్రిటన్ నిలిచింది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష/ ప్రధాని/ ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్(Rishi sunak) చరిత్ర సృష్టించారు. లిజ్ ట్రస్(Liz truss) రాజీనామాతో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో టోరీ సభ్యులు సోమవారం ఆయన్ను కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. ఈరోజు ఆయన బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా పరిణామంతో భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్ నిలిచింది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో ఓసారి పరిశీలిస్తే..
- రిషి సునాక్- బ్రిటన్ నూతన ప్రధాని: భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్ నగరంలో జన్మించిన రిషి పూర్వీకుల మూలాలు భారత్లోని పంజాబ్లో ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్కు వలస వెళ్లారు. బోరిస్ జాన్సన్ హయాంలో బ్రిటన్ ఆర్థికమంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు పొందిన రిషి సునాక్.. తాజాగా ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
- ఆంటోనియా కోస్టా - పోర్చుగల్ ప్రధానమంత్రి: గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవాకు చెందినవారు.
- మహమ్మద్ ఇర్ఫాన్ అలీ - గయానా అధ్యక్షుడు: ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
- ప్రవింద్ జుగ్నాథ్ - మారిషస్ ప్రధానమంత్రి : మారిషస్ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్ జుగ్నాథ్ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.
- పృథ్వీరాజ్సింగ్ రూపున్ - మారిషస్ అధ్యక్షుడు: మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్సింగ్ రూపున్ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్ అధ్యక్షుడు అయ్యారు.
- చంద్రికా ప్రసాద్ సంతోఖి (చాన్ సంతోఖి), సురినామ్ అధ్యక్షుడు: దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.
- కమలా హ్యారిస్ - అమెరికా ఉపాధ్యక్షురాలు: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన వారు.
ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై రాజకీయాల్లో కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఆరు దేశాలే కాకుండా ట్రినిడాడ్&టొబాగో, పోర్చుగల్, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?