Watch: రోబో గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 24.73 సెకన్లలో 100మీటర్లు పరుగు!
అమెరికాలోని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఓఎస్యూ) అభివృద్ధి చేసిన ఓ రోబో(Bipedal robot) గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అచ్చం......
వాషింగ్టన్: అమెరికాలోని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఓఎస్యూ) అభివృద్ధి చేసిన ఓ రోబో(Bipedal robot) గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అచ్చం మనిషిలాగే రన్నింగ్ రేసులో 100 మీటర్ల దూరాన్ని కేవలం 24.73 సెకెన్లలోనే చేరుకుని ఈ ఘనత సాధించింది. మెకనైజ్డ్ స్ప్రింటర్ కాస్సీ బైపెడల్ రోబో 100 మీటర్ల రన్నింగ్ రేసును వేగంగా పూర్తి చేయడం ద్వారా ఈ రికార్డు సృష్టించినట్టు ఓఎస్యూ ..ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో యూనివర్సిటీ వైట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ సెంటర్లో నిర్వహించిన ఈ పరుగు పందెంలో కాస్సీ ఎక్కడా కిందపడకుండా కేవలం 24.73 సెకెన్లలోనే 100 మీటర్ల రేస్ను పూర్తి చేసిందని వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే, రోబోకు ఎక్కడా కెమెరాలు, బాహ్య సెన్సార్లు అమర్చలేదన్నారు. ఆస్ట్రిచ్ పక్షిలాగే మోకాలు వంగి ఉంటుందని పేర్కొన్నారు.
గతేడాది నిర్వహించిన పరుగు పందెంలోనూ కాస్సీ 53 నిమిషాల్లో 5కి.మీలు పరిగెత్తడం విశేషం. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చి ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (DARPA) అందించిన 1మిలియన్ డాలర్ల గ్రాంటుతో ఈ రోబోను ఓరెగాన్ స్టేట్ రోబోటిక్స్ ప్రొఫెసర్ జోనాథన్ హారస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్టు ఓఎస్యూ తెలిపింది. ఈ వరల్డ్ రికార్డు సాధించేందుకు తగిన అవగాహన కోసం గత కొన్నేళ్లుగా 5కె, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేపట్టినట్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి డెవిన్ క్రోవ్లీ తెలిపారు. లోకోమోషన్ రోబోట్ లెర్నింగ్లో కాస్సీ ఓ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం