Nobel Prize: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గుర్ని వరించింది. ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ప్రకటించింది.
స్టాక్హోం: ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం (Physics)లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు.
అణువుల్లో (Atoms) ఎలక్ట్రాన్ డైనమిక్స్ను అధ్యయనం చేసేందుకు.. కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తు్న్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్ (Electrons)ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని పేర్కొంది.
ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైంది. నిన్న వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్లను ఈ అవార్డు వరించింది. ఇక, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవమాసాలు.. కృత్రిమ గర్భంలో..!
కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్; అండం, వీర్య దానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం (సరోగసీ), అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. -
యుద్ధాన్ని విస్తరించిన ఇజ్రాయెల్
గాజాపై ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది. -
ఇండోనేసియాలో బద్దలైన అగ్ని పర్వతం
ఇండోనేసియాలో మౌంట్ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. -
సిగరెట్లలోని ప్లాస్టిక్తో పర్యావరణంపై భారం
సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే వాటి కొన భాగంలో, ప్యాకేజింగ్లో ఉండే ప్లాస్టిక్లతో కలిగే వాతావరణ కాలుష్యం తక్కువేమీ కాదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
యాంటీబయాటిక్ల విపరీత వినియోగానికి అడ్డుకట్ట!
మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూటీఐ)ను సులభంగా నిర్ధారించడం ద్వారా యాంటీబయాటిక్ ఔషధాల విపరీత వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు దోహదపడగల సరికొత్త పరీక్షా విధానం త్వరలోనే అందుబాటులోకి రానుంది! -
పౌర మరణాలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలి
గాజాలో దాడుల సందర్భంగా పౌర మరణాలను తగ్గించడానికి చర్యలు చేపట్టేలా ఇజ్రాయెల్కు సూచనలు చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్కు సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. -
గురి తప్పిన సైనిక డ్రోన్
నైజీరియాలో రెబల్స్పైకి సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్ గురి తప్పి పౌరులపై పడింది. ఈ ఘటనలో 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. కదూనా రాష్ట్రంలోని ఇగాబీలో ఆదివారం రాత్రి ఒక మత ఉత్సవం చేసుకుంటున్న వారిపై ఆకస్మాత్తుగా డ్రోన్ బాంబు పడింది. -
అమెరికాలోని ఓ ఇంట్లో కాల్పులు
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో తుపాకీ కాల్పులకు అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి క్లార్క్ కౌంటీలోని ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బ్రిటన్ ‘ఉపాధి వీసా’ కఠినతరం
-
ఐదు మృతదేహాలతో ఓస్ప్రే విమాన శకలం లభ్యం
జపాన్ తీరానికి చేరువలో కూలిన అమెరికా వాయుసేన విమానం ‘సీవీ-22 ఓస్ప్రే’కు చెందిన శకలాలు, అందులో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సహాయ సిబ్బంది సోమవారం పేర్కొన్నారు. -
దళాలను వెనక్కితీసుకుంటామన్న భారత్
ద్వీప దేశమైన మాల్దీవుల్లో మోహరించిన దళాలను వెనక్కి తీసుకునేందుకు భారత్ అంగీకరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు తెలియజేశారు. -
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!
వృద్ధ దంపతులు తమ ఇంటి పెరట్లో ఓ క్రియాశీల బాంబుతో కాలం వెళ్లదీసిన ఘటన బ్రిటన్లో వెలుగుచూసింది. -
Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్ ఆందోళన
తమ దేశంలో నానాటికీ జనన రేటు క్షీణించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.