2000 Notes: గల్ఫ్లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
రూ.2 వేల నోట్లను మార్పిడి చేసేందుకు గల్ఫ్లోని భారతీయులు తీవ్ర తంటాలు పడుతున్నారు. అక్కడి కరెన్సీ ఎక్సేంజీ కేంద్రాలు రూ.2 వేల నోట్లను తిరస్కరించడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
దుబాయ్: రూ.2వేల (2000 Notes) నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటామని ఆర్బీఐ (RBI) తీసుకున్న నిర్ణయంతో గల్ఫ్ (Gulf Countries) దేశాల్లోని భారతీయులు (Indians) తీవ్ర తంటాలు పడుతున్నారు. వాటిని మార్చుకోవడం అక్కడున్న వారికి పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. రూ.2వేల నోట్లతో కరెన్సీ ఎక్స్ఛేంజీ కార్యాలయానికి వెళ్తే.. అక్కడి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఆ నోట్లను తీసుకోవద్దంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, నోట్ల మార్పిడి విధానంపై అక్కడి అధికారులకు సరైన అవగాహన లేకపోవడం కూడా భారతీయులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలు తమవద్దనున్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది. ఈలోగా నేరుగా బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని, లేదంటే ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది. అయితే, ఇప్పటికే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు.. అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అక్కడి కరెన్సీ మార్పిడి కేంద్రాలు కూడా రూ.2 వేల నోట్లను తీసుకోవడం నిలిపివేశాయి. దీంతో తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక అవస్థలు పడుతున్నారు. జేబులో డబ్బులు ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు.
వారం రోజుల క్రితం ఫిరోజ్ షేక్ అనే మహిళ.. భర్తను కలిసేందుకు తన ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయితే, మునుపటిలాగే రూ.2 వేల నోట్లు మార్పిడి చేసుకోవచ్చనే ఉద్దేశంతో కరెన్సీ ఎక్స్ఛేంజ్ కార్యాలయానికి వెళ్లి ఆమె ఎనిమిది 2వేల నోట్లు ఇచ్చారు. వాళ్లు తిరస్కరిండంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. సెప్టెంబరు 30 వరకు గడువు ఉన్నట్లు ఆమె చెప్పినా అక్కడున్న వారు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక.. భర్త వచ్చేంత వరకు అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. కేవలం ఆమె ఒక్కరే కాదు.. గల్ఫ్ దేశాల్లోని చాలా మంది భారతీయులు ఇలాంటి అవస్థలే పడుతున్నారు. తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ‘‘గల్ఫ్ దేశాల్లో రూ.2000వేల నోట్లను మార్చడం లేదు’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
తనకు తెలిసిన చాలా మంది దగ్గర రూ.2000 నోట్లు ఉన్నాయని, వాటిని మార్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారని గల్ఫ్లో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా తెలిపారు. ‘‘ ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. చాలా మంది వివిధ ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి వచ్చారు. వాళ్లకి డబ్బు అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నోట్ల మార్పిడి కుదరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బు ఉన్నా.. నిరుపయోగంగా మారిపోయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.