Joe Biden: బైడెన్ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి క్రెమ్లిన్పై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటికి దీటుగా మాస్కో కూడా ఆయా దేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తూ వస్తో్ంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి క్రెమ్లిన్పై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటికి దీటుగా మాస్కో కూడా ఆయా దేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు మంత్రులను రష్యాలోకి రాకుండా నిషేధం విధించగా.. తాజాగా బైడెన్ సతీమణి, కుమార్తెను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
‘‘రష్యాకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులపై అమెరికా విధిస్తోన్న ఆంక్షలకు ప్రతిస్పందనగా.. మరో 25 మంది అమెరికన్ పౌరులను ‘స్టాప్ లిస్ట్’ జాబితాలో చేర్చాం’’ అని రష్యా వెల్లడించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్, ఆయన కుమార్తె ఆష్లే బైడెన్ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు పలువురు యూఎస్ సెనెటర్లు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, మాజీ ప్రభుత్వాధికారులపై రష్యా ఈ నిషేధాజ్ఞలు విధించింది.
రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు అమెరికా దన్నుగా నిలుస్తోంది. ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం చేస్తోంది. మరోవైపు రష్యాను నిలువరించేందుకు అనేక ఆంక్షలు విధిస్తోంది. దీంతో ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన మాస్కో కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. ఈ ఏడాది మే నెలలో అధ్యక్షుడు బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, సీఐఏ చీఫ్ విలియమ్ బర్న్స్ సహా పలువురు ప్రముఖులు రష్యాలోకి రాకుండా నిషేధం విధించింది. అయితే ఈ ప్రయాణ నిషేధాలు పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం లాంఛనప్రాయ ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి.
ఇదిలా ఉండగా.. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రష్యా బంగారంపై నిషేధం విధించేందుకు యూకే, అమెరికా, కెనడా, జపాన్ సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్కు అధునాతన ఎయిర్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను పంపించేందుకు అమెరికా ముందుకొచ్చింది. త్వరలోనే ఈ వ్యవస్థను ఉక్రెయిన్కు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా తాజా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు