Ukraine Crisis: రష్యా విజయం సాధిస్తే ఐరోపాకు చీకటి రోజులే.. జెలెన్స్కీ హెచ్చరిక
ప్రస్తుత యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే.. ఐరోపావ్యాప్తంగా చీకటి రోజులు వస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా హెచ్చరించారు. మరోవైపు.. తమ భూభాగంలో దాదాపు 20 శాతం ప్రస్తుతం మాస్కో బలగాల నియంత్రణలో...
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే.. ఐరోపావ్యాప్తంగా చీకటి రోజులు వస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. మరోవైపు.. తమ భూభాగంలో దాదాపు 20 శాతం ప్రస్తుతం మాస్కో బలగాల నియంత్రణలో ఉందని వెల్లడించారు. లగ్జెంబర్గ్ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. ‘మేం ఈ యుద్ధంలో గెలిస్తే.. ఐరోపావాసులు ఎప్పటిలాగే తమ స్వేచ్ఛను ఆస్వాదించగలరు. కానీ, ఉక్రెయిన్తోపాటు యూరప్లో స్వేచ్ఛను నాశనం చేయాలనుకుంటున్న ఓ వ్యక్తి పైచేయి సాధిస్తే మాత్రం.. ఖండంలోని ప్రతి ఒక్కరికీ చీకటి కాలం వస్తుంది’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది పూర్తి స్థాయి యుద్ధమని, అందుకే ప్రపంచ దేశాల మద్దతు కోరుతున్నట్లు చెప్పారు.
రష్యన్ సేనల దాడుల్లో ఇప్పటివరకు వేలాది పౌరులు మరణించారని జెలెన్స్కీ తెలిపారు. మరోవైపు శత్రు మూకలతో తమ రక్షణా దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయని, ఇప్పటి వరకు 1,017 జనావాస ప్రాంతాలను మాస్కో చెర నుంచి విముక్తి చేశాయని చెప్పారు. ‘మాస్కో బలగాలు ఉక్రెయిన్లోని 3,620 జనావాస ప్రాంతాలపై దాడి చేశాయి. వాటిలో 1,017 ప్రాంతాలను తిరిగి మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం. మరో 2,603 ప్రాంతాలకు విముక్తి కల్పించాల్సి ఉంది. ఇప్పటికీ.. మా భూభాగంలో దాదాపు 20 శాతం దురాక్రమణదారుల నియంత్రణలో ఉంది. ఇది 1.25 లక్షల చదరపు కి.మీ. మేర విస్తీర్ణంతో సమానం. బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్లకన్నా చాలా ఎక్కువ’ అని తెలిపారు.
ఎనిమిదేళ్ల క్రితం ఉక్రెయిన్లోని కొన్ని భూభాగాలపై దాడి చేయడం ప్రారంభించినప్పుడే.. రష్యా ఆక్రమణ మొదలైందని జెలెన్స్కీ ఆరోపించారు. 2014- 22 మధ్యకాలంలో దాదాపు 43 వేల చదరపు కి.మీ మేర భూభాగాన్ని రష్యా తన నియంత్రణలోకి తెచ్చుకుందన్నారు. క్రిమియాతోపాటు డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లలోని ప్రధాన ప్రాంతాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. స్థానికంగా మానవతా సంక్షోభం నెలకొందని, దేశవ్యాప్తంగా 12 మిలియన్ల పౌరులు నిరాశ్రయులయ్యారని తెలిపారు. అయిదు మిలియన్లకు పైగా దేశాన్ని విడిచిపెట్టారని వెల్లడించారు. తమ భూభాగంలో సుమారు మూడు లక్షల చ.కి.మీల మేర ప్రాంతాలు ప్రమాదకర ల్యాండ్మైన్స్, పేలుడు పదార్థాలతో నిండి ఉన్నాయని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య గురువారానికి వందో రోజుకు చేరుకుంది. ఇప్పటికీ.. సంక్షోభం ముగింపు దిశగా సరైన అడుగులు పడటం లేదు! శాంతి చర్చల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మొదట్లో రాజధాని ‘కీవ్’ను ఆక్రమించేందుకు యత్నించి విఫలమైన రష్యన్ బలగాలు.. ప్రస్తుతం డాన్బాస్ ప్రాంతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. లేమాన్, సీవీరోడొనెట్స్క్ ఇలా క్రమంగా ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. మరోవైపు.. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ఉక్రెయిన్ బలగాల దీటైన స్పందన.. మాస్కోకూ తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. ఇప్పటివరకు 30 వేలకుపైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్