Ukraine Crisis: ఉక్రెనియన్ల హిట్లిస్ట్ సిద్ధం చేసిన రష్యా?.. ఐరాసకు అమెరికా లేఖ
ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల వేళ కలవరపరిచే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆ దేశంపై ఆక్రమణ సమయంలో.. చంపాల్సిన, నిర్బంధ శిబిరాలకు తరలించాల్సిన ఉక్రెనియన్ల జాబితాను రష్యా సిద్ధం చేసినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా...
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల వేళ కలవరపరిచే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆ దేశంపై ఆక్రమణ సమయంలో.. చంపాల్సిన, నిర్బంధ శిబిరాలకు తరలించాల్సిన ఉక్రెనియన్ల జాబితాను రష్యా సిద్ధం చేసినట్లు తమవద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఐరాస హ్యూమన్ రైట్స్ హై కమిషనర్ మిషెల్ బాచెలెట్కు లేఖ పంపినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్పై దాడికి దిగే అవకాశం ఉందని అగ్రరాజ్యం పలు సందర్భాల్లో చెప్పింది. ఈ క్రమంలోనే తాజా లేఖ రాసింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని, మానవ హక్కులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అందులో పేర్కొంది.
ఉక్రెయిన్లో శాంతియుత నిరసనలను చెదరగొట్టేందుకు, పౌరుల నుంచి వచ్చే ప్రతిఘటనలు, ఆందోళనలను ఎదుర్కొనేందుకు రష్యా బలగాలు తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చని కూడా సమాచారం ఉందని అమెరికా తెలిపింది. దాడి సమయంలో కిడ్నాప్లు, చిత్రహింసల వంటి దారుణాలు జరగవచ్చని.. రాజకీయ ప్రత్యర్థులు, మత, జాతిపరంగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ ప్రతిపాదించిన ఈ సదస్సు జరగాలంటే.. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు పాల్పడి ఉండకూడదని శ్వేతసౌధం పేర్కొంది. ఈ చర్చల విషయాన్ని ఫ్రాన్స్ కూడా ధ్రువీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.