Ukraine Crisis: రష్యా యుద్ధంతో.. ఉక్రెయిన్కు రూ.80 లక్షల కోట్ల నష్టం!
దాదాపు ఏడు నెలలుగా రష్యాతో కొనసాగుతోన్న యుద్ధంతో.. ఉక్రెయిన్ ఇప్పటికే అతలాకుతలమైంది. మాస్కో సేనల దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల...
కీవ్: దాదాపు ఏడు నెలలుగా రష్యా(Russia)తో కొనసాగుతోన్న యుద్ధంతో.. ఉక్రెయిన్(Ukraine) అతలాకుతలమవుతోంది. మాస్కో సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.80 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లినట్లు జెలెన్స్కీ(Zelensky) ఆర్థిక సలహాదారు ఓలెగ్ ఉస్తెంకో(Oleg Ustenko) వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ(Economy)ను యుద్ధ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా.. ఉక్రెయిన్ దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో ‘జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. రష్యా దాడికి ముందు ఉన్న ఉక్రెయిన్ వార్షిక జీడీపీతో పోల్చితే.. ప్రస్తుత నష్టం విలువ అయిదు రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు.
భారీఎత్తున విధ్వంసం, ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వంటి సమస్యలతో.. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉస్తెంకో చెప్పారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం సైతం.. మొదట్లో ఊహించిన దాంతో పోలిస్తే గణనీయంగా పడిపోయిందన్నారు. ప్రభుత్వ వ్యయంలో భారీ కోతలు విధించినప్పటికీ.. ఫిబ్రవరి నుంచి నెలకు ఐదు బిలియన్ యూరోల(4.9 బిలియన్ డాలర్లు) లోటును ఎదుర్కొంటోందని తెలిపారు. 2023లో ఇది దాదాపు 3.5 బిలియన్ యూరోలకు తగ్గుతుందన్నారు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ సైతం 35 నుంచి 40 శాతం క్షీణిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 1991లో స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి ఇదే అత్యంత గడ్డుకాలమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో.. 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అప్పట్లో అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?