Ukraine Crisis: ఆధారాల నాశనానికి రష్యా కొత్త కుట్ర్ర.. మాస్కోకు ఇన్ఫీ గుడ్బై.. 10 పాయింట్లు
ఉక్రెయిన్పై గత 49 రోజులుగా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు వైపులా వేలాది మంది సైనికులు మృతిచెందగా.......
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై గత 49 రోజులుగా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు వైపులా వేలాది మంది సైనికులు మృతిచెందగా.. అంతులేని నష్టం సంభవించింది. రష్యా సేనలు తమ నగరాలపై తూటాలు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతుండగా.. ఉక్రెయిన్ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తూ శత్రువుల్ని మట్టుబెడుతున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్పై పుతిన్ సేనలు కొనసాగిస్తున్న దండయాత్ర నేపథ్యంలో పలు అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. యుద్ధంతో తీవ్ర విధ్వంసానికి గురైన ఉక్రెయిన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి 10 కీలక పాయింట్లు..
- సెంట్రల్ ఉక్రెయిన్లోని డ్నిప్రో నగరంలోని మార్చురీ రిఫ్రిజిరేటర్లలో 1500లకు పైగా రష్యా సైనికుల మృతదేహాలు ఉన్నాయని, వాటిని ఇంతవరకు ఎవరూ తీసుకుపోలేదని ఆ నగర మేయర్ మిఖైల్ లెస్నెంకో తెలిపారు. రష్యన్ తల్లులు వచ్చి వారి కుమారుల మృతదేహాల్ని తీసుకెళ్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
- సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్లో భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యాకు అనేక అంతర్జాతీయ సంస్థలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. నిన్న నోకియా సంస్థ రష్యా విపణితో సంబంధాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా భారత సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా రష్యా నుంచి తమ కార్యకలాపాలను తరలిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ ప్రకటించారు. ఉక్రెయిన్లో సంక్షోభ వాతావరణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
- రష్యా బలగాల దాడుల్ని ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు 19,800 మందికి పైగా శత్రు సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే, రష్యాకు చెందిన 158 విమానాలు, 143 హెలికాప్టర్లు, 739 ట్యాంకులు, 1964 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది.
- ఉక్రెయిన్తో చర్చలు ఆన్లైన్లో కొనసాగుతున్నట్టు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జెఖారొవా వెల్లడించారు.
- రష్యా తన సైన్యం అరాచకాలకు సంబంధించిన ఆధారాల్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. సైనిక చర్యలో మృతి చెందిన ఉక్రెయిన్ పౌరుల మృతదేహాలను రష్యా సైనికులు ఎక్కడికక్కడ దహనం చేసేందుకు మొబైల్ శ్మశానవాటికలను నిర్వహిస్తున్నట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ నివేదికలు పేర్కొంటున్నాయి. మేరియుపోల్లో 13 మొబైల్ క్రిమిటోరియంలు పనిచేస్తున్నట్టు తెలిపింది.
- రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 191మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ వెల్లడించారు. అలాగే, 349 మంది చిన్నారులు గాయపడినట్టు తెలిపారు. ఏప్రిల్ 11న ఖర్కివ్లో రష్యా బలగాల దాడిలో నెలన్నర శిశువుతో పాటు 12 ఏళ్ల బాలుడు మృతిచెందగా.. ఖేర్సన్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
- ఐరోపా దేశాల అధినేతలు ఉక్రెయిన్లో పర్యటించారు. పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియా దేశాల అధినేతలు కీవ్ నగరంతో పాటు అక్కడికి 40కి.మీల దూరంలోని బోరోడియంక పట్టణాన్ని పరిశీలించారు. రష్యా బలగాల దాడులతో తీవ్ర విధ్వంసానికి గురైన ప్రదేశాలను పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడా, లిథువేనియా అధ్యక్షుడు గిటానాస్ నౌసెడా, లాత్వియా అధ్యక్షుడు ఎగిల్స్ లెవిట్స్, ఎస్తోనియా అధ్యక్షుడు అలార్ కరిస్ గమనించారు. ఈ పర్యటనలో భాగంగా వారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయడం, రష్యన్లతో పోరాడేందుకు అవసరమైన ఆయుధ సాయంపై చర్చించే అవకాశం ఉంది.
- ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు రష్యా సేనలు కొనసాగిస్తున్న దండయాత్రలో ఉక్రెయిన్లో దాదాపు 100 సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలు ధ్వంసమైనట్టు యునెస్కో వెల్లడించింది. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకొనేందుకు అనేక ఏళ్లు పడుతుందని రష్యా మాజీ ఆర్థిక మంత్రి ఒకరు తెలిపారు.
- సుమీలో 100 మందికి పైగా పౌరుల్ని రష్యా బలగాలు చంపేసినట్టు ఆ ప్రాంత గవర్నర్ దిమిత్రో జెవిత్స్కీ వెల్లడించారు. ప్రజల చేతుల్ని కట్టేసి, వారిని చిత్ర హింసలకు గురిచేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయని, ఇంకొన్ని మృతదేహాలపై తలపై కాల్చినట్టు గుర్తులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
- రష్యా కొనసాగిస్తున్న యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్కు ఈయూ మరోసారి సాయం ప్రకటించింది. ఉక్రెయిన్ సైన్యం సమర్థతను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా దేశ ప్రజల రక్షణ కోసం అదనంగా 540 మిలియన్ డాలర్లు సాయంగా ఇస్తున్నట్టు ఐరోపా దేశాల మండలి వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు అందించిన సాయం 1.6బిలియన్ డాలర్లకు చేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు