Ukraine Crisis: రష్యాకు భారీ సైనిక నష్టం.. 1500 మంది సైనికాధికారులు మృతి..!
ఉక్రెయిన్ యుద్ధంలో భారీ స్థాయిలో సైనిక నష్టం జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం రష్యా వైపే సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. వీరిలో 1500 మంది ఉన్నతాధికారులు ఉండగా, వారిలో 160 మంది వివిధ స్థాయి సైనిక జనరళ్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న భీకర యుద్ధంలో వేల మంది సైనికులు మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా వైపు భారీస్థాయిలో ప్రాణనష్టం జరుగుతున్నట్లు చెబుతున్నాయి. ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో 1500 మందికి పైగా రష్యా సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదిక పేర్కొంది. అందులో 160 మందికిపైగా జనరల్ స్థాయి అధికారులున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన నివేదికలను బట్టి ఈ అంచనాలు వెలువడుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టానికి సంబంధించి పాశ్చాత్య దేశాలు వేస్తోన్న అంచనాలను రష్యా అంగీకరించడం లేదు. సెప్టెంబర్ వరకు కేవలం 5397 మంది సైనికులు మాత్రమే చనిపోయినట్లు అధికారికంగా పేర్కొంది. అయితే, యుద్ధంలో ఇప్పటివరకు లక్షకు పైగా రష్యా సైనికులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని అమెరికా జనరల్ మార్క్ మిల్లే వెల్లడించారు. అటు ఉక్రెయిన్కు కూడా ఇదే సంఖ్యలో సైనికులను కోల్పోయినట్లు అంచనా వేశారు. అంతేకాకుండా మరో 40వేల మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోగా.. 1.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది వలస వెళ్లినట్లు చెప్పారు.
ఈ యుద్ధంలో సుమారు 87వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ సైనిక విభాగం కూడా ఇటీవలే పేర్కొంది. ఇలా సైనిక మరణాలే ఈ స్థాయిలో ఉంటే తీవ్ర గాయాలపాలైన వారి సంఖ్య మూడింతలు ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తొలి రెండు నెలల్లోనే రష్యా వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు అంచనా. ఇటువంటి సమయంలో ఇరు దేశాలకు సైనిక విజయం సాధ్యం కాదని.. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేందుకు అవకాశాలు ఉన్నాయని అమెరికా జనరల్ మార్క్ మిల్లే అభిప్రాయపడ్డారు.
మరిన్ని రోజులు ప్రతికూల పరిస్థితులు
రష్యా చేస్తోన్న భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్కు అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పవర్ గ్రిడ్ పూర్తిగా దెబ్బతినడంతో చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. దీంతో తీవ్ర చలి నుంచి రక్షించుకోవడం ఇబ్బందిగా మారింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మరోవారంపాటు కొనసాగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించినా రష్యా సేనలను తమ సైన్యం దీటుగా తిప్పికొడుతోందని ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ