Russia Invasion: రష్యా ఈ యుద్ధాన్ని ఆపాల్సిందే..! ఐరాస చీఫ్
ఉక్రెయిన్లో 30లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోగా మరో 20లక్షల మంది స్వదేశంలోనే ఇతర చోట్లకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
30లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్ దాటినట్లు వెల్లడి
వాషింగ్టన్: ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడి పౌరులు భారీ స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోగా మరో 20లక్షల మంది స్వదేశంలోనే ఇతర చోట్లకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇలా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పోరాడుతోన్న ఉక్రెయిన్ పౌరులకు శాంతి ఎంతో అవసరమని పేర్కొంది. ప్రపంచ దేశాలు కూడా ఇదే కోరుకుంటున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో వెంటనే యుద్ధానికి రష్యా ముగింపు పలకాలని ఐరాస స్పష్టం చేసింది.
‘దాదాపు 30లక్షలకుపైగా ఉక్రెయిన్ శరణార్థులు దేశం విడిచి వెళ్లిపోయారు. తీవ్ర ఆపదలో ఉన్న ఉక్రెయిన్లకు శాంతి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఇదే డిమాండ్ చేస్తున్నారు. రష్యా వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలి’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. అంతకుముందు ఇదే విషయంపై వివరాలు వెల్లడించిన ఐరాస శరణార్థి విభాగం.. మరో 20లక్షల మంది దేశంలో ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయినట్లు తెలిపింది. తమ కుటుంబీకులను ఇతర ప్రాంతాలకు పంపిస్తోన్న ఫొటోలను షేర్ చేసిన యూఎన్హెచ్సీఆర్.. కేవలం శాంతి మాత్రమే వారిని తిరిగి కలుపుతుందని అభిప్రాయపడింది.
పోలండ్కు 20లక్షల మంది..
ఉక్రెయిన్ నుంచి శరణార్థులుగా వెళ్లిపోతున్న పౌరులు ఎక్కువగా సమీప పోలండ్కు చేరుకుంటున్నారు. పొలండ్ సరిహద్దు భద్రతా దళాల గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 19.5లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు తమ దేశంలోకి వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు హంగరీకి ఉక్రెయిన్ పౌరుల వలసలు పెరిగాయి. ఇదే విషయాన్ని వెల్లడించిన హంగరీ ప్రధానమంత్రి విక్టోర్ ఓర్బన్.. రానున్న రోజుల్లో తమదేశంలోకి శరణార్థుల తాడికి మరింత పెరగనున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దులో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించేందుకు సిబ్బందిని మరింత పెంచామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.