Ukraine Crisis: రష్యా నెక్ట్స్ టార్గెట్ అదేనా?.. ప్లాన్ బహిర్గతం!
ఉక్రెయిన్ తర్వాత రష్యా టార్గెట్ మాల్దోవా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దురాక్రమణ ఏడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని.. కేవలం నిస్సైనీకరణ మాత్రమే తమ లక్ష్యమంటూ రష్యా చెబుతోంది. కానీ, ఉక్రెయిన్ రాజధానితోపాటు ప్రధాన నగరాలపై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అంతేకాకుండా కి.మీ మేర కాన్వాయ్తో కూడిన సైనిక బృందాలను ఉక్రెయిన్లోనికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తర్వాత రష్యా టార్గెట్ మాల్దోవా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సైనిక చర్య క్రమాన్ని వివరిస్తూ బెలారస్ అధ్యక్షుడు చూపించిన కీలక మ్యాప్ రష్యా పన్నాగానికి బలాన్ని చేకూరుస్తోంది.
మాల్దోవా లక్ష్యంగా..?
ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆ దేశ భద్రతా మండలిలో చర్చించారు. ముఖ్యంగా సైనిక చర్యపై రష్యా ప్రణాళిక, వారి సేనలు మోహరిస్తోన్న వాహనాలు, ఆయుధ సామగ్రి, ఉక్రెయిన్ నగరాలపై దాడుల క్రమాన్ని ఓ మ్యాప్లో చూపిస్తూ అధ్యక్షుడు లుకషెంకో అధికారులకు వివరించారు. అందులో ఉక్రెయిన్ను నాలుగు భాగాలుగా చూపించారని.. దక్షిణ ఉక్రెయిన్ నుంచి ‘మాల్దోవా’ లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు విశ్లేషించాయి. మాల్దోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు ఆ మ్యాపులో ఉన్నాయని వెల్లడించాయి. బెలారస్ అధ్యక్షుడు ఆ మ్యాపులో వివరించినట్లుగానే రష్యా సేనలు దాడులు చేస్తుండడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే, ఉక్రెయిన్లోని ఒడెసా నగరం నుంచి మాల్దోవాలోకి రష్యా సైన్యం ప్రవేశించాలంటే ఆ మార్గంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సరిహద్దుల్లో బెలారస్ బలగాలు..
రష్యా ప్రణాళిక, ఉక్రెయిన్పై దాడులకు సంబంధించి బెలారస్ అధ్యక్షుడు వారి అధికారులకు వివరించిన వీడియోను అధికార వెబ్సైట్లో పోస్టు చేశారు. అందులో మాల్దోవా దురాక్రమణ మినహా బెలారస్ నుంచి దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి జర్నలిస్ట్ కూడా ప్రస్తావించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్కు సరిహద్దు ప్రాంతంలో తమ బలగాలను మోహరించినట్లు భద్రతా మండలి సమావేశంలో అధ్యక్షుడు లుకషెంకో వెల్లడించారు. మరోవైపు పొలండ్ సరిహద్దులోనూ సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దాడిలో తాము పాలుపంచుకోమని బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో చెప్పడం గమనార్హం.
ఇదిలాఉంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్కు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా ఉక్రెయిన్పై చేస్తోన్న దాడులకు తమ భూభూగాన్ని ఉపయోగించుకోవచ్చని రష్యాకు ఇటీవలే అనుమతి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో బెలారస్ నుంచి ఇప్పటికే క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ కూడా ఆరోపించింది. మరోవైపు పూర్వపు సోవియట్ యూనియన్ను తిరిగి సాకారం చేయాలని కలలుకంటోన్న పుతిన్ ఇందులో భాగంగానే ఉక్రెయిన్, మాల్దోవా దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నంగా దీన్ని చెబుతున్నారు. గతంలో మాల్దోవా కూడా సోవియట్ యూనియన్లో భాగం కావడంతో ఆ దేశాన్ని మళ్లీ తన స్వాధీనం చేసుకునేందుకే పుతిన్ పన్నాగం పన్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. -
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM