Ukraine Crisis: బెలారస్కు రష్యా అణుక్షిపణులు..!
ఉక్రెయిన్తో యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలు ఉండటంతో రష్యా కీలక నిర్ణయం తీసుకొంది. స్వల్పశ్రేణి అణుసామర్థ్య క్షిపణులను బెలారస్కు తరలించనుంది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్తో యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలు ఉండటంతో రష్యా కీలక నిర్ణయం తీసుకొంది. స్వల్పశ్రేణి అణుసామర్థ్య క్షిపణులను బెలారస్కు తరలించనుంది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇసికందర్-ఎం వ్యవస్థలు బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను సంప్రదాయ లేదా అణువార్ హెడ్లతో ప్రయోగించవచ్చు. శనివారం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సెయింట్ పీటర్స్ బర్గ్కు వచ్చారు. అక్కడ ఆయన పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘‘రానున్న కొన్ని నెలల్లో బెలారస్కు ఇసికందర్-ఎం టాక్టికల్ మిసైల్ వ్యవస్థలను అందించాలని నిర్ణయం తీసుకొన్నాం’’ అని పేర్కొన్నారు.
ఈ వ్యవస్థల తరలింపుపై ఇరుదేశాల రక్షణ శాఖలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే ఇసికందర్ క్షిపణులను బాల్టిక్ ప్రాంతంలోని కలినిన్గ్రాడ్లో కూడా రష్యా మోహరించింది. నాటో దేశాలైన పోలాండ్-లిథువేనియా మధ్యలో కలినిన్ గ్రాడ్ ప్రాంతం ఉంది. రష్యా నుంచి సామగ్రిని తమ భూభాగం పై నుంచి తరలించడాన్ని లిథువేనియా ఇటీవలే నిషేధించింది. ఈ నేపథ్యంలో బెలారస్కు అణు సామర్థ్య క్షిపణులను రష్యా అందజేస్తుండటం గమనార్హం. లిథువేనియా చర్య ఓ రకంగా యుద్ధం ప్రకటించడం వంటిదేనని.. దానిని అస్సలు ఆమోదించకూడదని బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో వాఖ్యానించడం ఆందోళనలు పెంచుతోంది. మరోవైపు బెలారస్ వాడుతున్న సు-25 విమానాలు అణ్వాయుధాలు తీసుకెళ్లేలా మార్పులు చేస్తామని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
మరోవైపు లుహాన్స్క్ ప్రాంతంలోని సెవిరోదొనెట్స్క్ నగరాన్ని రష్యా సేనలు పూర్తిగా ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ వెల్లడించారు. డాన్బాస్లోని కీలకమైన రెండు పారిశ్రామిక నగరాల్లో ఇది కూడా ఒకటి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM