Russia: ఆంక్షల వేళ.. భారత్ సాయం కోరిన రష్యా..?
కార్లు, ఎయిర్క్రాఫ్ట్లు, రైళ్ల విడిభాగాలతో పాటు పలు రంగాలకు సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలు పంపించాలని రష్యా.. భారత్ను కోరినట్లు సమాచారం.
మాస్కో పర్యటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను అడ్డుకునేందుకు అమెరికా సహా అనేక దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపించాయి. ఈ ఆంక్షల ప్రభావంతో రష్యాలో కీలక రంగాల కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి తలెత్తుతోంది. దీంతో మాస్కో.. భారత్ను సాయం కోరినట్లు తెలుస్తోంది. 500లకు పైగా ఉత్పత్తులను పంపించాలని క్రెమ్లిన్ కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కార్లు, ఎయిర్క్రాఫ్ట్లు, రైళ్ల విడిభాగాలతో పాటు పలు రంగాలకు సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలు పంపించాలని రష్యా కోరినట్లు సమాచారం. ఈ మేరకు తమకు కావాల్సిన 500లకు పైగా ఉత్పత్తుల జాబితాను దిల్లీకి పంపించినట్లు సదరు కథనాలు తెలిపాయి. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కోలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందే రష్యా తన అభ్యర్థనను పంపించినట్లు తెలుస్తోంది. అయితే జైశంకర్ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చిందా? లేదా అన్నది తెలియరాలేదు. రష్యాకు భారత్ ఆ ఉత్పత్తులను ఎగుమతి చేసే విషయమై ఇరు దేశాల మధ్య మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దీనిపై భారత వాణిజ్య, విదేశాంగ మంత్రిత్వ శాఖలు గానీ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఉక్రెయిన్పై సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత.. రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించింది. ఇటీవల మాస్కో పర్యటనలో జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతుల్యత తీసుకురావాలంటే.. రష్యాకు భారత్ ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆంక్షల కారణంగా రష్యాలో కొన్ని కీలక ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విదేశీ ఆటోమొబైల్ సంస్థలు మాస్కో మార్కెట్ నుంచి తరలిపోవడంతో కార్ల విడిభాగాల కొరత ఏర్పడింది. అటు ఎయిర్లైన్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. పేపర్ బ్యాగులు, కన్స్యూమర్ ప్యాకేజింగ్, టెక్స్టైల్, నికెల్ వంటి లోహ పదార్థాలు కూడా సరిపడా అందుబాటులో లేవు. దీంతో ఆయా ముడిపదార్థాల కోసం రష్యా.. ఇప్పుడు భారత్ సహా కొన్ని దేశాలను సాయం కోరినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై