Drone Attack: పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర..! రష్యా సంచలన ఆరోపణ
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా ఆరోపించింది. ఈ క్రమంలోనే క్రెమ్లిన్పై డ్రోన్ దాడి జరిగిందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) హత్యకు ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనంపై (Kremlin) డ్రోన్ దాడి జరిగిందని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను (Drone Attack) కూల్చివేశామని వెల్లడించింది. దీన్ని ఉగ్ర ప్రణాళికగా భావిస్తున్నామన్న రష్యా.. తమ అధ్యక్షుడిని అంతం చేసేందుకే ఈ ప్రయత్నాలని ఆరోపించింది. అయితే, డ్రోన్ దాడి ఉక్రెయిన్ చేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలనూ వెల్లడించలేదు. కానీ, సరైన సమయంలో దీటుగా స్పందిస్తామని రష్యా పేర్కొంది.
‘క్రెమ్లిన్ లక్ష్యంగా రెండు డ్రోన్లు దూసుకొచ్చాయి. వెంటనే స్పందించి వాటిని కూల్చివేశాం. ఈ ఘటనలో పుతిన్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాడి సమయంలో పుతిన్ క్రెమ్లిన్లో లేరు. నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారు. క్రెమ్లిన్ భవనానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పుతిన్ సురక్షితంగా ఉన్నారన్న ఆయన.. అధ్యక్షుడి షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. ఈ డ్రోన్ల దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం వెల్లడైన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నగరంలో ఎటువంటి అనధికారిక డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధిస్తున్నట్లు మాస్కో మేయర్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవి కాకుండా మిగతా ఎటువంటి డ్రోన్లు ఎగిరేందుకు అనుమతి లేదని ప్రకటించారు. మరోవైపు మే 9 మాస్కోలో విక్టరీ డే పరేడ్ నిర్వహించనున్నారు. ఈ డ్రోన్ల దాడి కలవరం సృష్టించినప్పటికీ ఆ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని క్రెమ్లిన్ వెల్లడించింది.
డ్రోన్ దాడితో సంబంధం లేదు : ఉక్రెయిన్
రష్యా అధ్యక్ష భవనం(క్రెమ్లిన్)పై జరిగిన డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్ స్పందించింది. డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అలా చేయడం ఉక్రెయిన్కు ఎటువంటి ప్రయోజనం లేదని.. కేవలం రష్యా మరింతగా దాడులు చేసేందుకు కారణమవుతుందని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో రష్యా చేయనున్న దాడులను సమర్థించుకోవడానికే క్రెమ్లిన్ తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్ తెలిపింది. తాజా పరిణామాలను చూస్తుంటే ఉక్రెయిన్పై భారీ స్థాయిలో దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందని జెలెన్స్కీ సలహాదారు మైకిలో పొదొల్యాక్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రస్తుతం ఫిన్లాండ్ పర్యటనలో ఉన్నారు.
జెలెన్ స్కీ నివాసంపై క్షిపణి ప్రయోగించాల్సిందే.. రష్యన్ ఎంపీల డిమాండ్
రష్యాపై డ్రోన్ దాడులకు పాల్పడుతోన్న ఉక్రెయిన్పై తీవ్ర దాడులతో ప్రతిఘటించాల్సిందేనంటూ రష్యన్ పార్లమెంట్ సభ్యుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. రష్యా పార్లమెంట్ దిగువసభ డ్యూమా ఛైర్మన్గా ఉన్న వచెస్లావ్ వొలొదిన్ (Vyacheslav Volodin).. డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా కీవ్ను అడ్డుకోగల, నాశనం చేయగల ఆయుధాలను ఉపయోగించాలన్నారు. క్రెమ్లిన్పై దాడి అనంతరం టెలిగ్రామ్లో స్పందించిన ఆయన.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో రష్యా చర్చలు జరపవద్దని స్పష్టం చేశారు. మరో డ్యూమా సభ్యుడు మికెల్ షెరెమెట్ మాట్లాడుతూ.. కీవ్లోని జెలెన్స్కీ నివాసంపై క్షిపణి ప్రయోగం జరపాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్