ఉక్రెయిన్లో పురుషులనూ వదలని రష్యన్లు..
కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
ఆధారాలు సేకరిస్తున్నామన్న ఐరాస
కీవ్: ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యాసేనలు చేస్తోన్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోన్న రష్యా సైన్యం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటికే డజనుకుపైగా కేసులను గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడంలో భాగంగానే రష్యా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికనందునే తాము క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నట్లు ఐరాస పేర్కొంది.
గుర్తించడం ఓ సవాలే..
‘అత్యాచారాన్ని కళంకంగా భావించడంతోపాటు ఇతర కారణాల వల్ల మహిళలు, బాలికలు వాటిని బయటకు వెల్లడించలేకపోతారు. ఇక పురుషుల విషయానికి వస్తే ఇది మరింత కష్టం. లైంగిక హింస కేసులను గుర్తించడానికి బాధితులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి’ అని యుద్ధాల్లో లైంగిక నేరాలపై దర్యాప్తు జరుపుతోన్న ఐరాస విభాగ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా ప్యాటెన్ పేర్కొన్నారు. ఇప్పటికే డజనుకు పైగా ఇటువంటి కేసులపై దర్యాప్తు జరుపుతున్నామన్న ఆమె.. బయటపడని కేసులెన్నో ఉండవచ్చాన్నారు. అత్యాచారం నుంచి బయటపడిన మగవారు ఆ నేరం గురించి వెల్లడించడం సవాలుతో కూడుకున్నదన్నారు. అయినప్పటికీ దోషులను గుర్తించి వారిని అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టేందుకు బాధితులు ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.
వ్యూహంలో భాగమే..
మరోవైపు పురుషులు, మహిళలు, చిన్నారులపై రష్యా సైన్యం జరుపుతోన్న లైంగిక దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెదిక్తొవా పేర్కొన్నారు. వ్యూహంలో భాగంగానే రష్యా సేనలు ‘అత్యాచారం’ అనే ఆయుధాన్ని వాడుకుంటోందని ఆరోపించిన ఆమె.. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునే వ్యూహమేనన్నారు. ఇటువంటి నేరాలపై కొందరు మాత్రమే ఉక్రెయిన్లు పెదవి విప్పుతుండగా.. మరికొందరు మాత్రం దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఈ తరహా లైంగిక నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని వెనెదిక్తొవా వెల్లడించారు.
స్పష్టమైన సంకేతాలు..
ఉక్రెయిన్లో యుద్ధం పేరుతో రష్యా సైన్యం సృష్టిస్తోన్న అరాచకాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. గ్యాంగ్రేప్లు, కుటుంబ సభ్యులముందే లైంగిక దాడుల వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. కేవలం ఒక్క బుచా నగరంలోని ఓ బేస్మెంట్లోనే మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి ఇప్పటికే 25మంది బాధితులను నుంచి ఆధారాలు సేకరించినట్లు ఐరాస పేర్కొంది. వీటితోపాటు చనిపోయిన వారిపై లైంగిక దాడిని గుర్తించేందుకు మృతదేహాలకు పొస్టుమార్టం చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో లైంగిక హింస ఘటనలు క్రమబద్ధంగా కొనసాగుతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నందునే తాను కీవ్లో పర్యటిస్తున్నట్లు ఐరాస ప్రతినిధి ప్యాటెన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?