Zelensky: నిధుల కోసం జెలెన్స్కీ ఇంటిని విక్రయించనున్న రష్యా..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) ఇంటిని రష్యా(Russia) విక్రయించనుంది. దానిద్వారా వచ్చిన డబ్బును యుద్ధంలో వాడనుంది. అసలు అది ఎలా సాధ్యమంటే..?
మాస్కో: ఉక్రెయిన్(Ukraine)పై చేపడుతోన్న సైనిక చర్యను కొనసాగించేందుకు రష్యా(Russia) నిధులు సేకరిస్తోంది. అందుకోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) ఇంటిని విక్రయించనుంది. ఆశ్చర్యమనిపించినా అది నిజం. అయితే, ఆ ఇల్లు క్రిమియా ప్రాంతంలో ఉండటంతో రష్యా ఈ సాహసం చేస్తోంది.
2014లో రష్యా దళాలు ఉక్రెయిన్ నుంచి క్రిమియా(Crimea)ను ఆక్రమించుకొన్నాయి. దాని పాలనా వ్యవహారాల కోసం రష్యా ఒక క్రిమియన్ నేతను నియమించింది. ఆయన విడుదల చేసిన వీడియోపై అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. ఉక్రెయిన్ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు చెందిన 57 ఆస్తులను జాతీయం చేయాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని క్రిమియన్ నేత ఆ వీడియోలో వెల్లడించారు. ‘ఒలెనా జెలెన్స్కా పేరు మీద ఉన్న ప్లాట్తో కలిపి పలు ఆస్తులపై క్రిమియాకు హక్కులు రానున్నాయి. రష్యా సొంతమైన క్రిమియాలో మాస్కో శత్రువులకు ఆస్తులు ఉండకూడదు’అని అందులో పేర్కొన్నారు.
జెలెన్స్కీ 2013లో క్రిమియాలోని తీరప్రాంతమైన లివాడియాలో ఇంటిని కొనుగోలు చేశారు. వెకేషన్లో భాగంగా వారు అక్కడ గడిపేవారు. ఆ ఇల్లు జెలెన్స్కీ సతీమణి ఒలెనా పేరు మీద ఉంది. దాని విలువ మన కరెన్సీలో రూ. ఆరు కోట్లపైనే. అయితే రష్యా.. క్రిమియాను ఆక్రమించిన తర్వాత వారు ఆ ప్రాంతానికి వెళ్లడం సాధ్యం కాలేదు. ఇప్పుడు దానిని క్రిమియాలోని స్థానిక ప్రభుత్వం వేలం వేయనుంది. ఆ భవనంతో పాటు మొత్తం 57 ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన నిధులను రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య కోసం వెచ్చించనున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు క్రిమియా పార్లమెంట్ స్పీకర్ రష్యా మీడియాకు వెల్లడించారు. ఇదిలాఉంటే.. క్రిమియాను అధికారికంగా ఉక్రెయిన్లోని భాగంగానే చాలా దేశాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్