Ukraine Crisis: యుద్ధం @ 50 డేస్.. 20వేల మంది రష్యా సైనికులు మృతి.. 10 కీలక పాయింట్లు
ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఇంకా లుహాన్స్క్, ఖర్కివ్, మేరియుపొల్ సహా పలు నగరాలపై పుతిన్ సేనలు విరుచుకుపడుతూనే ఉన్నాయి......
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఇంకా లుహాన్స్క్, ఖర్కివ్, మేరియుపొల్ సహా పలు నగరాలపై పుతిన్ సేనలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. రష్యా సేనల భీకర దాడుల్ని ఉక్రెయిన్ సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. ‘మా దేశాన్ని లొంగ దీసుకునేందుకు 5 రోజులు చాలని దురాక్రమణదారులు భావించారు. కానీ, 50 రోజులుగా మేం పోరాడుతూనే ఉన్నాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగంగా ప్రసంగించారు. యుద్ధాన్ని ఎదుర్కొనే ధైర్యం తమకు ఉందన్న ఆయన.. తమకు ఆయుధాలు సమకూర్చాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. తొలుత ఉక్రెయిన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే.
- రష్యా దూకుడును ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. పుతిన్ సేనలకు ఎక్కడికక్కడ బ్రేక్లు వేస్తూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 20వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. 163 యుద్ధవిమానాలతోపాటు 144 హెలికాప్టర్లు, 756 ట్యాంకులు, 1443 సాయుధ శకటాలు, 76 ఇంధన ట్యాంకులు, ఎనిమిది నౌకలు సహా భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది.
- యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్ నుంచి దాదాపు 50 లక్షల మంది ఇతర దేశాలకు తరలివెళ్లారని యూఎన్ శరణార్థుల విభాగం హైకమిషనర్ వెల్లడించారు. అలాగే, ఉక్రెయిన్ వ్యాప్తంగా 71 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో పురుషులు ఉక్రెయిన్ వీడటంపై నిషేధం ఉండటంతో.. శరణార్థులుగా పొరుగు దేశాలకు వెళ్లిన వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
- ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా తమ బలగాలు ఇప్పటివరకు ఉక్రెయిన్కు చెందిన 456 డ్రోన్లు, 2,213 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ తెలిపారు.
- దక్షిణ ఖేర్సన్ ప్రాంతంలో ఖైదీల మార్పిడికి ఇరు దేశాలూ అంగీకరించినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన చర్చల అనంతరం.. పోసాద్-పొక్రొవ్స్కోయ్ గ్రామం సమీపంలో ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరినట్టు ఉక్రెయిన్ తెలిపింది.
- తమ భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు, విధ్వంసానికి పాల్పడినా.. ప్రతిస్పందనగా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై క్షిపణి దాడులను ఉద్ధృతం చేస్తామని రష్యా రక్షణశాఖ హెచ్చరించింది. దక్షిణ రష్యాలోని బ్రియాన్స్క్ ప్రాంతంలో ఓ పట్టణంపై రెండు ఉక్రెయిన్ హెలికాప్టర్ల దాడుల్లో.. ఓ చిన్నారితోపాటు ఏడుగురు గాయపడినట్టు రష్యా ఆరోపించగా.. కీవ్ ఆ వార్తలను ఖండించింది.
- నాటోలో చేరిక విషయంలో ఫిన్లాండ్, స్వీడన్లకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. నాటోలో చేరే ముందు దాని వల్ల కలిగే పర్యవసనాలను అర్థం చేసుకోవాలని సూచించింది. నాటోలో చేరితే ద్వైపాక్షిక సంబంధాలతోపాటు యూరప్ భద్రతా నిర్మాణం విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అధికారులు అర్థం చేసుకోవాలని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
- తమ యుద్ధనౌక మాస్క్వా నీటమునిగినట్లు రష్యా అంగీకరించిందని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా ఇంటెలిజెన్స్ రిపోర్టులో వెల్లడించింది. రష్యా నౌకాదళంలోని మూడు స్లావా-క్లాస్ యుద్ధనౌకల్లో.. సోవియట్ కాలం నాటి మాస్క్వా ఒకటని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. నల్ల సముద్రంలో నావికాదళం పనితీరుపై రష్యా సమీక్ష చేసే అవకాశం ఉందని పేర్కొంది.
- కీవ్ శివారులోని ఓ మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి ప్రయోగించింది. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక, ఖర్ఖివ్కు సమీపంలో ఉన్న ఓ గ్రామంపై రష్యా వ్యూహాత్మక రాకెట్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ కోసం పోరాడుతోన్న 30 మంది పోలాండ్ సైనికులను హత్య చేసినట్లు రష్యా మిలిటరీ తెలిపింది.
- తూర్పు ఉక్రెయిన్ డొనెట్స్క్ ప్రాంతంలోని పోపాస్నా, రూబిజ్నే నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. ఎనిమిది రష్యన్ దాడులను తిప్పికొట్టామని, నాలుగు రష్యా యుద్ధ ట్యాంకులు, ఆరు సాయుధ వాహనాలు, నాలుగు పదాతిదళ పోరాట వాహనాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
- తూర్పు, దక్షిణ ఉక్రెయిన్లోని యుద్ధ ప్రాంతాల నుంచి పౌరుల తరలింపునకు శుక్రవారం తొమ్మిది మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఉప ప్రధాని ఇరినా వెరెష్చుక్ వెల్లడించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్ల నుంచి గురువారం 2500 మందిని తరలించినట్లు తెలిపారు. పోర్ట్ సిటీ మేరియుపొల్ నుంచి 289 మంది సొంత వాహనాల ద్వారా బయటపడ్డారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి. -
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..