Odisha Mystery: ఒకే హోటల్లో.. ఇద్దరు రష్యన్ల మృతి.. అసలేం జరిగింది..?
భారత్లో పర్యటిస్తోన్న రష్యాకు చెందిన ఓ చట్టసభ సభ్యుడితోపాటు మరో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. మిత్రుడి మరణం తట్టుకోలేకనే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు చనిపోవడం చర్చనీయాంశమయ్యింది.
మాస్కో: భారత్ పర్యటనలో ఉన్న ఇద్దరు రష్యన్లు (Russians) రెండు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. రష్యా చట్టసభ సభ్యుడు, వితరణశీలి పావెల్ ఆంటోవ్ ఇటీవల ఒడిశా (Odisha)లోని రాయగడలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. స్థానిక హోటల్లో బస చేసిన ఆయన మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. అంతకు రెండురోజుల క్రితం.. అదే హోటల్లో ఆయన స్నేహితుడూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరిలో చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అధ్యక్షుడు పుతిన్పై కొన్ని నెలల క్రితం విమర్శలు చేశారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రష్యాలో సంపన్నుడిగా పేరొందిన పావెల్ ఆంటోవ్(65) తన పుట్టిన రోజును చేసుకునేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి డిసెంబరు 21న ఒడిశాలోని రాయగడకు చేరుకున్నారు. పావెల్ మిత్రుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61) డిసెంబర్ 22న అనుమానాస్పద స్థితిలో హోటల్ ప్రాంగణంలో మరణించారు. గుండెపోటు కారణంగా మరణించి ఉండొచ్చని భావించిన పోలీసులు.. కుటుంబ సభ్యుల అనుమతితో అంత్యక్రియలు పూర్తిచేశారు. రెండు రోజుల తర్వాత అదే హోటల్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో రక్తపు మడుగులో పావెల్ అంటోవ్ కనిపించారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మూడో అంతస్తు నుంచి జారిపడ్డారా..? అనే విషయంపై స్పష్టత లేదని హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. బాల్య స్నేహితుడి (వ్లాదిమిర్ బిదెనోవ్) మరణాన్ని తట్టుకోలేకనే ఆంటోవ్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు భారత్లో ప్రాణాలు కోల్పోవడంపై ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. పుతిన్పై విమర్శలు గుప్పించేవారు రష్యాలో ఇలాగే అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై భారత్లోని రష్యా ఎంబసీ తాజాగా స్పందించింది. ఒడిశాలో జరిగిన విషాద ఘటన తమకు తెలిసిందని పేర్కొంది. అందులో పావెల్ ఆంటోవ్.. రష్యాలోని ‘వ్లాదిమిర్ ఒబ్లాస్ట్’ అసెంబ్లీ సభ్యుడని వెల్లడించింది. వారు బస చేస్తున్న హోటల్ గది కిటికీ నుంచి కిందపడి చనిపోయినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అందులో నేరపూరిత కోణం ఏమీ లేదని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్