Ukraine Crisis: సాయం అందనివ్వట్లేదు.. బయటకు వెళ్లనివ్వట్లేదు!
ఉక్రెయిన్పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యన్ సేనలు.. వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.....
సహాయక సామగ్రి కాన్వాయ్పైనా రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యన్ సేనలు.. వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. రాజధాని కీవ్ శివార్లలో భారీగా మోహరించిన బలగాలు మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగానూ పలు నగరాలపై దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయా నగరాల్ని వీలైనంత త్వరగా గుప్పిట పట్టేందుకు రష్యన్ సేనలు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. సామాన్య పౌరులకు అందుతున్న సహాయక చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి. సైనిక సామగ్రి సరఫరాపైనా అస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి.
అంత్యక్రియలకూ అవకాశం లేదు..
శనివారం దాదాపు 4.30లక్షల మంది జనాభా ఉన్న మరియోపోల్కు అందుతున్న సాయాన్ని రష్యన్ సేనలు అడ్డుకున్నాయి. ఆహారం, మంచినీరు, ఔషధాల వంటి సామగ్రితో వెళుతున్న ట్రక్కులపైనా దాడులు జరిగాయి. అలాగే నగరాన్ని వీడి వెళుతున్న పౌరులనూ అడ్డుకుంటుండడం గమనార్హం. కీవ్కు 20 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న కొంతమందిపై రష్యన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా 7 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు వెల్లడించాయి. మరియోపోల్లో ఇప్పటి వరకు 1,500 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ కార్యాలయం ప్రకటించింది. చివరకు మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉండడం లేదని స్థానికులు వాపోయారు.
విదేశీ సైనిక సామగ్రి సరఫరాపై దాడి చేస్తాం..
కాల్పుల విరమణ నిమిత్తం శనివారం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు సైనిక సామగ్రి కోసం 200 మిలియన్ డాలర్లు సాయాన్ని ఉక్రెయిన్కు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే, తమ సేనలు విదేశీ సైనిక సరఫరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని రష్యన్ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు.
లొంగిపోయే హక్కు మనకు లేదు.. జెలెన్స్కీ
మరోసారి వీడియో సందేశంలో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమెర్ జెలెన్స్కీ.. తమ దేశాన్ని ముక్కలుగా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా కొన్ని నగరాల్లో సూడో రిపబ్లికన్ల ముసుగులో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తోందన్నారు. లుహాన్క్స్, దొనెట్స్క్ తరహాలో నిరసనలను శ్రీకారం చుడుతోందన్నారు. అలాగే మరియోపోల్ నగర మేయర్ అపహరణతో ఓ కొత్త రకం ఉగ్రవాదానికి తెరతీస్తోందని ఆరోపించారు. వీటన్నింటినీ ఉక్రెయిన్ సమర్థంగా ఎదురొడ్డి నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రవేశించిన యుద్ధ యంత్రాన్ని ముక్కలు చేసేందుకు తమకు మరింత సమయం, బలం కావాలని వ్యాఖ్యానించారు. పౌరులు తమ ప్రతిఘటనను కొనసాగించాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే హక్కు లేదన్నారు. ఎంత కష్టమైనా పోరాడాలంటూ ఉక్రెయిన్ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 1,300 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు తెలిపారు.
మరోవైపు మరియోపోల్ పోర్టు ముట్టడికి రష్యన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అందులో భాగంగా నగర తూర్పు ప్రాంతంపై ఇప్పటికే పట్టు సాధించాయని పేర్కొంది. ఆసుపత్రి సిబ్బంది ఉన్న ఓ తొమ్మిది అంతస్తుల భవనంపై రష్యన్ సేనలు కాల్పులు జరిపినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!