Ukraine Crisis: అత్యాచారమే ఆయుధంగా.. !
పక్కగదిలో బిడ్డ ఏడుస్తున్నా, తల్లిపై సామూహిక అత్యాచారం.. పదేళ్ల చిన్నారులను వదలని క్రూరత్వం.. అందుకే వారి నుంచి తప్పించుకునేందుకు జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు.. ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న మారణహోమంలో ఇలా ఎన్నో అమానవీయ ఘటనలు బయటకువచ్చాయి.
ఉక్రెయిన్ మహిళలపై రష్యా సేనల దురాగతాలు.. తోసిపుచ్చిన మాస్కో
న్యూయార్క్: పక్కగదిలో బిడ్డ ఏడుస్తున్నా, తల్లిపై సామూహిక అత్యాచారం.. పదేళ్ల చిన్నారులనూ వదలని క్రూరత్వం.. అందుకే వారి నుంచి తప్పించుకునేందుకు జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు.. ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న మారణహోమంలో ఇలా ఎన్నో అమానవీయ ఘటనలు బయటకువచ్చాయి. పుతిన్ సేనల తీరుతో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. వీటిని అంతర్జాతీయ సమాజంతో పాటు, ఉక్రెయిన్ మానవహక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రస్తుతం ఐరాస భద్రతామండలి ఈ దుశ్చర్యల గురించి ఇరు దేశాల వాదనలు వింటోంది.
‘రష్యా సైనికులు పాల్పడుతోన్న దారుణాలపై మా సంస్థకు 9 ఫిర్యాదులు వచ్చాయి. 12 మంది మహిళలు, బాలికలపై అత్యాచారం, లైంగిక దాడి జరిపినట్లు బాధితులు వెల్లడించారు. మొత్తం నేరాల్లో బయటకు వచ్చిన ఈ సంఖ్య చాలా చాలా తక్కువ. రష్యన్ దురాక్రమణదారులు హింస, అత్యాచారాలను యుద్ధ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని మాకు తెలుసు. అది మాకు కనిపిస్తోంది. మీరు మా ఆవేదన వినాలని కోరుకుంటున్నాం’ అంటూ లా స్ట్రాడా అనే మానవ హక్కుల సంస్థ ప్రెసిడెంట్ కేథరినా ఐరాసలో వెల్లడించారు. అయితే ఆ ఆరోపణలను రష్యా ఖండించింది. ‘ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలు.. రష్యా సైనికులను శాడిస్టులు, రేపిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఐరాసలో ఆ దేశ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఇదిలా ఉండగా.. రష్యా దాడితో వెలుగుచూస్తోన్న ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస అధికారులు పిలుపునిచ్చారు. అలాగే యుద్ధభూమిలో చిక్కుకుపోయిన చిన్నారులను రక్షించాల్సిన ఆవశ్యకతను చాటారు. ‘అత్యాచారం, లైంగిక దాడి ఘటనల గురించి ఎక్కువగా వింటున్నాం. జవాబుదారీతనం, న్యాయం కోసం వీటిపై దర్యాప్తు జరగాలి. తక్షణం ఈ యుద్ధం ఆగాలి’ అని ఐరాసకు చెందిన మహిళా ఏజెన్సీ డైరెక్టర్ సిమా బహౌస్ డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి ప్రకటించిన దగ్గరి నుంచి ఎన్నో కలచివేసే దృశ్యాలు, ఘటనల్ని ఈ ప్రపంచం చూసింది. కీవ్ సమీపంలో బుచా పట్టణం అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. రష్యా తన సేనల్ని ఉపసంహరించుకున్న తర్వాత అక్కడకు వెళ్లినవారికి ఆ ప్రాంతమంతా మరుభూమిగా కనిపించింది. ఇప్పటికీ పుతిన్ సేనలు విధ్వంసం సృష్టిస్తోన్న మేరియుపొల్ నగరం ఎలా ఉంటుందోనని ఉక్రెయిన్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. మరోవైపు.. తాము పలుమార్లు చెప్పినట్లుగానే పౌరసమాజంపై రష్యా యుద్ధం చేయదని అక్కడి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ఉక్రెయిన్ రెచ్చగొట్టే చర్యల్లో భాగమనేనని పుతిన్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కానీ వాస్తవాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. అయితే ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారం ఉండటంతో దర్యాప్తునకు ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్