MQ-9 Reaper: అడ్డుపడటం వల్లే అలా జరిగింది.. లేదు అదే కూలిపోయింది..
నల్లసముద్రంపై నిఘా నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన డ్రోన్ కూలిపోవడంపై అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం రెండు దేశాలు మధ్య నేరుగా ఘర్షణలు రావడం ఇదే తొలిసారి.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం : ఏడాదికి పైగా ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దండయాత్రలో తాజాగా జరిగిన ఉదంతంతో అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు శిఖరస్థాయికి చేరాయి. నల్లసముద్రంపై అంతర్జాతీయ జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న ఎంక్యూ రీపర్ 9 డ్రోన్ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు అడ్డుపడటంతో డ్రోన్ సముద్ర జలాల్లో కూలిన విషయం తెలిసిందే.
చమురును కుమ్మరించాయి..
రష్యా సరిహద్దుకు దూరంగా గస్తీ నిర్వహిస్తున్న రీపర్ డ్రోన్పై రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు ఇంధనాన్ని కుమ్మరించాయి. అనంతరం డ్రోన్ ప్రొపెల్లర్ను ఢీకొనడంతో డ్రోన్ సముద్రంలో కూల్చేసుకున్నామని అమెరికా పేర్కొంది. రష్యన్ పైలట్లు ఎలాంటి అవగాహన లేకుండా డ్రోన్ను అడ్డుకున్నారని అమెరికా సంయమనం పాటించకుంటే రెండు రష్యా విమానాలు నేలకూలిండేవని అమెరికా వాయుసేన అధికారులు పేర్కొన్నారు. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న అనంతరం నల్లసముద్రంపై రష్యా వాయుసేన రాకపోకలు ఎక్కువయ్యాయి. అయితే తాము రష్యా గగనతలంలోకి రాలేదని గత సంవత్సర కాలంగా అంతర్జాతీయ గగనతలంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది.
మా సరిహద్దుల్లోకి డ్రోన్ ప్రవేశించింది..
అయితే అమెరికా ప్రకటనను రష్యా అధికారవర్గాలు ఖండించాయి. తమ సరిహద్దుల్లోకి రావడంతో రెండు యుద్ధవిమానాలు దానిని అడ్డుకునేందుకు యత్నించాయని తెలిపారు. అయితే ఈ క్రమంలో డ్రోన్ కూలిపోయిందని రష్యా విమానాలు ఎలాంటి ఇంధనాన్ని కుమ్మరించలేదని వెల్లడించింది.
ఎంక్యూ రీపర్ అంటే..
అమెరికా అమ్ముల పొదిలోని అధునాతమైన డ్రోన్ ఇది. నిఘాతో పాటు దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. రిమోట్ ద్వారా పనిచేసే ఈ డ్రోన్ దాదాపు 11 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తు, 2,200 కిలోల బరువు కలిగివుంటుంది. 24 గంటలు ఎగరడంతో పాటు2400 కి.మీ. మేర నిఘా నిర్వహించగలదు. 2007లో దీన్ని అమెరికా వాయుసేనలో ప్రవేశపెట్టారు.
గతంలోనూ ఇలాంటి ఉదంతాలు..
* ప్రపంచంలో పెద్దదేశాలైన అమెరికా-రష్యాల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంటాయి. 2020లో అమెరికా బి-52 బాంబర్ నల్లసముద్ర గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో రష్యన్ విమానాలు అత్యంత సమీపానికి వచ్చాయి. కేవలం 100 అడుగుల సమీపంలో రావడం గమనార్హం.
* 2021లో నల్లసముద్రంలో అమెరికా సైనిక విన్యాసాల సమయంలో అమెరికా యుద్ధనౌక డొనాల్డ్ కుక్కు సమీపంలోకి రష్యా వాయుసేన విమానాలు వచ్చాయి.
* గత ఏడాది అలస్కా మీదుగా వెళుతున్న రెండు రష్యా యుద్ధవిమానాలను అమెరికా యుద్ధ విమానాలు కాసేపు అనుసరించాయి.
మన దగ్గరా ఆ డ్రోన్లు ఉన్నాయి..
రీపర్ డ్రోన్లు యుద్ధతంత్రంలో కీలకపాత్ర పోషిస్తాయి. నిఘాతో పాటు దాడులు చేయగలదు. పైలట్ రహిత ఈ డ్రోన్లకు పలు రకాల ఆయుధాలను అమర్చి నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యముంది. 2017లో వీటిని కొనుగోలు చేసేందుకు భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని డ్రోన్లు భారత్కు చేరగా సముద్రజలాలపై నిఘాకు వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లకు హంటర్ కిల్లర్ అనే పేరు కూడా ఉంది. శత్రువులు ఎక్కడ ఉన్నా వెతికి మట్టుబెడుతుంది. అందుకనే ఈ పేరు వచ్చింది. అఫ్ఘన్లో సైనికచర్యలో భాగంగా అమెరికా పలుసార్లు ఈ డ్రోన్ను వినియోగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్