Russia: పుతిన్పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్స్టార్’ మృతి
ఉక్రెయిన్పై (Ukraine) దురాక్రమణ చేస్తోన్న పుతిన్పై (Vladimir Putin) విమర్శలు గుప్పించే ఓ రష్యన్ గాయకుడు (Russian Popstar) ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చోటుచేసుకున్న ఓ నది ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తెలిసింది.
మాస్కో: ఉక్రెయిన్పై (Ukraine) దురాక్రమణ మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై సొంత దేశంలోనే విమర్శలు వచ్చాయి. సైనికుల కుటుంబీకుల మొదలు సెలబ్రిటీలు కూడా పుతిన్ చర్యపై వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా చర్చనీయాంశమయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పుతిన్పై తన పాటలతో వ్యతిరేక గళాన్ని వినిపించిన ఓ రష్యన్ పాప్స్టార్ (Russian Popstar) తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు ఓ నదిని దాటుతున్న సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
దిమా నోవా (35) అసలు పేరు దిమిత్రి విర్గినోవ్. క్రీమ్సోడా అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు. మార్చి 19న నోవా తన సోదరుడు సహా ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డకట్టిన వోల్గా నది వద్దకు వెళ్లారు. మంచు నదిని దాటుతున్న క్రమంలో అందులో పడిపోయారు. స్నేహితుల్లో ఇద్దర్ని రక్షించగా.. దిమాతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు క్రీమ్సోడా వెల్లడించింది.
పాప్స్టార్గా పేరు తెచ్చుకున్న దిమా నోవా.. ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధానికి వ్యతిరేకంగా తన పాటలు, సంగీతం ద్వారా నిరసన తెలపడం మొదలుపెట్టాడు. అందులో అక్వా డిస్కో అనే పాట ఎంతో ఆదరణ పొందడంతోపాటు వివాదాస్పదం కూడా అయ్యింది. కేవలం యుద్ధానికి సంబంధించినవే కాకుండా పుతిన్కు చెందిన ఆస్తులపైనా నోవా విమర్శలు గుప్పించేవాడు. పుతిన్కు సుమారు రూ.10వేల కోట్ల విలువైన ఖరీదైన భవనం ఉందంటూ విమర్శలు చేశాడు. ఇలా వరుస విమర్శలతో దిమా నోవా ఎంతో పాపులర్ అయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసరం ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!