Russia: మా వాళ్లను యుద్ధానికి పంపొద్దు : పుతిన్కు రష్యన్ మహిళల విజ్ఞప్తి
ఏడాదికాలంగా ఉక్రెయిన్పై యుద్ధం (Ukraine Crisis) చేస్తోన్న రష్యా.. భారీ స్థాయిలో బలగాలను కోల్పోతోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సరైన శిక్షణ లేకుండానే తమ కుటుంబీకులను ఉక్రెయిన్ పంపించవద్దని రష్యన్ (Russia) మహిళలు పుతిన్కు విజ్ఞప్తి చేస్తున్నారు.
మాస్కో: ఉక్రెయిన్పై (Ukraine Crisis) సైనిక చర్య పేరిట మొదలైన రష్యా దురాక్రమణ ఏడాదికిపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సైన్యం కూడా మాస్కోను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వేల మంది రష్యన్ (Russia) సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమవారిని యుద్ధక్షేత్రంలోకి పంపించడం ఆపాలంటూ రష్యన్ మహిళలు అధ్యక్షుడు పుతిన్కు (Vladimir Putin) విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన శిక్షణ, ఆయుధాలు లేకపోవడంతో తమ కుటుంబీకులు శత్రువుల చేతిలో బలవుతున్నారని వాపోతూ ఆందోళనకు దిగారు.
‘రష్యన్లు మాతృభూమికి సేవ చేసేందుకు సిద్ధమై.. సైన్యంలో చేరుతున్నారు. కానీ, సాయుధ బలగాల మాదిరిగా శిక్షణ పొందలేదు. గత సెప్టెంబర్లో సైనిక సమీకరణ చేపట్టిన నుంచి కేవలం నాలుగు రోజులే శిక్షణ ఇచ్చారు. వారిని ఇప్పుడు దాడులు చేసే సైనిక బృందాల్లో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో శత్రువుల చేతిలో బలికావాల్సి వస్తోంది. గొర్రెలను వధించేందుకు తీసుకెళ్తున్నట్లు శత్రువులు మన వాళ్లను తీసుకుపోతున్నారు. వెంటనే తమవారిని ఉక్రెయిన్కు పంపడం ఆపేయండి’ అంటూ రష్యన్ మహిళలు ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో రష్యన్ వార్తా ఛానల్ సోటా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసేందుకు... లక్షల మందితో రష్యా సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, పుతిన్ నిర్ణయం పట్ల సొంత దేశంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. భయాందోళనలకు గురైన రష్యన్లు దీన్ని తప్పించుకునేందుకు సమీప దేశాలకు వెళ్లిపోయారు. అయితే, సైన్యంలో చేరిన వారికి సరైన శిక్షణ ఇవ్వకుండానే యుద్ధ క్షేత్రంలోకి రష్యా పంపించిందనే ఆరోపణలు వచ్చాయి. ఉక్రెయిన్లో తమకు సరైన తిండి, పోరాడేందుకు ఆయుధాలు లేవంటూ కొందరు రష్యన్ సైనికులు వాపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటువంటి తరుణంలో తమ కుటుంబీకుల కోసం రష్యన్ తల్లులు, భార్యలు తమ వారిని యుద్ధంలోకి పంపించవద్దని పుతిన్కు విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)