కొవిడ్ పాజిటివ్ వచ్చినా అక్కడ ఐసోలేషన్ అక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్తో వణికిపోయిన దక్షిణాఫ్రికాలో తాజాగా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
జోహన్నస్బర్గ్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్తో దక్షిణాఫ్రికా నాలుగో వేవ్ చవిచూసిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ తొలిసారిగా వెలుగు చూసింది కూడా అక్కడే. అయితే, తాజాగా అక్కడ వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. అంతేకాకుండా పాఠశాలల్లో ఒక మీటరు భౌతికదూరం ఉండాలంటూ విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది.
‘తాజా నిబంధనల ప్రకారం, పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలేమీ లేకుంటే ఐసోలేషన్ అవసరం లేదు. టెస్టు తర్వాత లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. ఇదివరకు ఈ వ్యవధి పది రోజులుగా ఉంది. అంతేకాకుండా కొవిడ్ భాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిలో లక్షణాలు లేకుంటే వారు కూడా ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు’ అని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్తోపాటు ప్రెసిడెంట్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే కొవిడ్ ఆంక్షలను సడలించినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ముఖ్యంగా 60 నుంచి 80 శాతం ప్రజల్లో కొవిడ్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన సీరో సర్వేల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటి నుంచి పాఠశాలల్లో ఒక మీటరు భౌతిక దూరం ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు తక్షణమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గత రెండేళ్లుగా భౌతికదూరం ఆంక్షలు అమలులో అక్కడి పాఠశాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!