S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
జీ20 సదస్సుకు సారథ్యం వహించడం సవాళ్లతో కూడుకొన్నదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. అదే విధంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు.
న్యూయార్క్: జీ20 సదస్సు (G20 sumitt)కు సారథ్యం వహించడంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్లపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) మాట్లాడారు. న్యూయార్క్ (New York) వేదికగా జరిగిన ‘ఇండియా- యూఎన్ గ్లోబల్ సౌత్: డెలివరింగ్ ఫర్ డెవలప్మెంట్’(India-UN for Global South:Delivering for Development) సదస్సులో ఆయన పాల్గొన్నారు.
‘‘జీ20 సవాళ్లతో కూడుకున్న సదస్సు. దీనికి సారథ్యం వహించడమూ ఓ సవాలే. ఒకవైపు ప్రపంచం పేద, సంపన్న దేశాలుగా.. తూర్పు-పశ్చిమ ధ్రువాలు (రష్యా-పశ్చిమ దేశాలు)గా విడిపోతున్న సమయంలో భారత్ జీ20 సదస్సుకు సారథ్యం వహించింది. కొన్ని వారాల తర్వాతే మళ్లీ మనం ఇక్కడ భేటీ అవుతున్నాం. నేటి సదస్సుకు మీ రాక మాకు చాలా ముఖ్యం. భారత్ గురించి మీకున్న సెంటిమెంట్లను, సౌత్-సౌత్ (దక్షిణ భాగంలో ఉన్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల) సహకారం ప్రాముఖ్యాన్ని ఇది నొక్కి చెబుతోంది. ప్రపంచ అభివృద్ధి, పురోగతి అజెండాగా భారత్ జీ20 సదస్సుకు బాధ్యత వహించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని జైశంకర్ పేర్కొన్నారు.
‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉన్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు (సౌత్-సౌత్) ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన లేవనెత్తారు. జీ20 సదస్సులో భాగంగా ఎన్నో దేశాలతో భారత్ చర్చలు జరిపిందన్నారు. దీనిలో చాలా విషయాలు గమనించిన్నట్లు తెలిపారు. గ్లోబల్ సౌత్లో నిర్మాణాత్మక అసమానతలు, రాజకీయ పోటీలు, ఉద్రికత్తలు, సంఘర్షణలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వివాదాల కారణంగా దక్షిణ దేశాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. అంతేకాకుండా భౌగోళిక రాజకీయ సమీకరణలు, పోటీలు అనేక దేశాల్లో ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి ప్రాథమిక అవసరాలు తీరడంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. భారత్ తరఫున కేంద్రమంత్రి జైశంకర్ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో (UNGA) సెప్టెంబరు 26న ప్రసంగించనున్నారు. ఇందు కోసం ఆయన ఇప్పటికే న్యూయార్క్ చేరుకొన్నారు. అనంతరం ఆయన వాషింగ్టన్ డీసీని సందర్శించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
కెనడా స్టూడెంట్ పర్మిట్ డిపాజిట్ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
Women Education: మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అఫ్గానిస్థాన్లో మహిళల విద్యపై తాలిబన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..
ఇజ్రాయెల్ దళాలు గాజాలో భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకొన్నాయి. వీరిని లోదుస్తులతో తరలించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. -
Modi-Putin: మోదీపై ఒత్తిడి తేవడం అసాధ్యం: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత్-రష్యా(India-Russia) మధ్య సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) అన్నారు. అలాగే మోదీ విధానాలను ప్రశంసించారు. -
White House: పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రకేసు భారత్-అమెరికా మధ్య ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. తాజాగా శ్వేతసౌధం ఈ కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తును ఆశిస్తున్నట్లు ప్రకటించింది. -
కెనడాలో భారతీయ చిత్రాలు ఆడుతున్న థియేటర్లలో కలకలం
కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలో ఆగంతుకులు గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేయడంతో కలకలం రేగింది. -
చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఆత్మహత్య!
ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో అనేకం కనిపిస్తాయి. అదే కోవలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు కిన్ గాంగ్. -
బీబీసీ ఛైర్మన్గా సమీర్ షా
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఛైర్మన్ పదవికి భారత్లో జన్మించిన డాక్టర్ సమీర్ షా (71)ను ప్రభుత్వం ఎంపిక చేసింది. -
ఖాన్ యూనిస్లో హోరాహోరీ
గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై విరుచుకుపడుతోంది. -
అమెరికాలో కాల్పులకు పాల్పడిన ప్రొఫెసర్
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్ వేగాస్లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. -
ఇక ఫేస్బుక్ మెసెంజర్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తప్పనిసరి
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో సందేశాలు, కాల్స్కు ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను తప్పనిసరి (డిఫాల్ట్) చేస్తున్నట్లు దాని మాతృసంస్థ మెటా గురువారం ప్రకటించింది. -
డేటింగ్లో భారత్, అమెరికా
భారత్-అమెరికా బంధం ప్రపంచానికి మేలు చేస్తుందని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యానించారు. అలాగే రెండు దేశాల బంధాన్ని రొమాంటిక్ రిలేషన్షిప్గా అభివర్ణించారు. -
ఓస్ప్రే విమానాల సేవల నిలిపివేత
తమ సైన్యంలో ఉన్న ఓస్ప్రే వీ-22 విమానాల సేవలను వెంటనే నిలిపివేయాలని (గ్రౌండింగ్) అమెరికా నిర్ణయించింది. -
మార్చి 17న రష్యా ఎన్నికలు.. పోటీపై ఇంకా పెదవి విప్పని పుతిన్
రష్యా అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు గురువారం నిర్ణయించారు. -
రష్యాలో కాల్పులకు పాల్పడిన విద్యార్థిని.. ఒకరి మృతి
రష్యాలో ఓ పాఠశాల విద్యార్థిని(14) దారుణానికి పాల్పడింది. తుపాకీతో తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. -
అందరికీ కరోనా సోకాలని నేను కోరుకోలేదు
కరోనా వైరస్ బ్రిటిష్ జనాభా అంతటికీ వ్యాపించాలని తాను కోరుకున్నాననే ఆరోపణలను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ఖండించారు. -
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర అంశం.. భారత్పై అమెరికా సెనెటర్ల విమర్శ
న్యూయార్క్లో ఓ సిక్కు వేర్పాటువాదిని హతమార్చడానికి భారత ప్రభుత్వాధికారి ఒకరు కుట్రపన్నారనే ఆరోపణను పురస్కరించుకుని అమెరికా పాలక, ప్రతిపక్ష సెనెటర్లు భారత్పై విమర్శలు గుప్పించారు. -
నిక్కీ హేలీ అవినీతిపరురాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం అలబామా విశ్వవిద్యాలయంలోని మూడీ మ్యూజిక్ హాలులో బుధవారం వాడీవేడీగా జరిగింది. -
టైప్ 1 మధుమేహానికి కీళ్లవాతం మందు
కీళ్ల వాతానికి వాడే బారిసిటినిబ్ మందు ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించగలదని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. -
గాజా సంక్షోభంతో ప్రపంచానికి ముప్పు
గాజా సంక్షోభంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అనూహ్యంగా స్పందించారు. యూఎన్ చార్టర్లో సెక్రటరీ జనరల్కు విశేషాధికారాలు కల్పించే అధికరణం 99ను ఉపయోగిస్తూ.. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు.


తాజా వార్తలు (Latest News)
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ