Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!
ఇరాక్పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్రకు 20 ఏళ్లు పూర్తవుతోంది. నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ శక్తిసంపదలకు, అమెరికన్ సేనల దాడులకు గుర్తుగా ఇప్పటికీ ఓ విలాసవంత నౌక మనకు సగం నీట మునిగి కనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్ర(Iraq Invasion)కు నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. 2003 మార్చి 20న అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్లకు చెందిన పదాతిదళాలు ఇరాక్(Iraq)లోకి ప్రవేశించాయి. భారీ విధ్వంసాన్ని సృష్టించే ఆయుధాల(MDW)ల ఏరివేత, దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్(Saddam Hussein) ఉగ్రవాదానికి అందిస్తోన్న మద్దతు నిర్మూలన, ఇరాకీయులను విముక్తులను చేయడమే లక్ష్యంగా చెబుతూ.. దాదాపు 1.70 లక్షలకుపైగా సైనికులు ఇరాక్ వీధుల్లో అడుగుపెట్టారు. ఈ పరిణామాలతో సద్దాం 24 ఏళ్ల పాలనకు తెరపడింది. తదనంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడిన ఆయనకు.. 2006 డిసెంబర్ 30న ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.
ఇలా.. ఇరాక్ దండయాత్రకు రెండు దశాబ్దాలు పూర్తవుతోన్నా.. సద్దాం హుస్సేన్ శక్తిసంపదలకు చిహ్నంగా, అమెరికన్ దాడులకు గుర్తుగా నేటికీ ఓ విలాస నౌక మనకు కనిపిస్తుంది. అదే ‘అల్- మన్సూర్’. ఇరాక్లోని ఓ జలరవాణా మార్గంలో సగం మునిగిపోయి, తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఈ నౌక.. నాటి చరిత్రను గుర్తుచేస్తుంది. 121 మీటర్ల పొడవున్న ‘అల్- మన్సూర్’ను 1980ల్లో నిర్మించారు. సద్దాంకు చెందిన మూడు నౌకల్లో ఇదీ ఒకటి. బంగారు కుళాయిలు, ఈత కొలనులు తదితర విలాస సౌకర్యాలతో తీర్చిదిద్దిన దీనిపై గరిష్ఠంగా 200 మంది ప్రయాణించవచ్చు. రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. దండయాత్ర సమయంలో.. దాన్ని భద్రంగా ఉంచేందుకుగానూ బస్రాలో లంగరు వేయాలంటూ సద్దాం ఆదేశాలు జారీ చేశాడు.
అయితే, కొన్ని రోజులకే సంకీర్ణ సేనలు.. ‘అల్- మన్సూర్’ను లక్ష్యంగా చేసుకున్నాయి. దాడుల్లో ధ్వంసమైన ఈ నౌక.. షత్ అల్-అరబ్ జలమార్గంలో క్రమంగా ఒరిగిపోయి, సగం మునిగిపోయింది. ఒకవైపు సద్దాం పరారీ, మరోవైపు స్థానికంగా గందరగోళ పరిస్థితుల నడుమ.. అందులోని ఖరీదైన సామగ్రి, ఫర్నిచర్, విడిభాగాలు, ఇతరత్రా వస్తువులు లూటీ అయ్యాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ నౌక ప్రస్తుతం.. సందర్శకులు, స్థానికులకు విడిదిగా మారింది. ‘సద్దాం హయాంలో ఎవరూ దీని దగ్గరికి వచ్చే సాహసం చేయలేదు. ఇప్పుడు దాని చుట్టే తిరుగుతున్నారు’ అని స్థానికులు చెబుతున్నారు. దీన్ని పరిరక్షించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. సకల సౌకర్యాలతో తయారు చేయించుకున్న ఈ నౌకలో సద్దాం ఎప్పుడూ ప్రయాణించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం