Iran: ‘ఇప్పుడు ఆయనో జీవచ్ఛవం..’ రష్దీపై దాడి చేసిన యువకుడికి బహుమతి!
గతేడాది సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన యువకుడి చర్యను ఇరాన్ ఫౌండేషన్ కొనియాడింది. అతనికి ఇరాన్లో వెయ్యి చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని బహుమానంగా అందజేస్తామని ప్రకటించింది.
టెహ్రాన్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ(Salman Rushdie)పై గతేడాది ఓ వ్యక్తి దాడిచేసి, తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ రష్దీ ఒక కన్ను, చేయి కోల్పోయారు. ఈ క్రమంలోనే ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని ఇరాన్(Iran) ఫౌండేషన్ తాజాగా ప్రశంసించింది. దీంతోపాటు అతనికి ఇరాన్లో 1,000 చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖొమేనీ ఫత్వాలను అమలు చేసేందుకు ఏర్పాటయిన ఈ ఫౌండేషన్ కార్యదర్శి మహ్మద్ ఎస్మాయిల్ జరీ ఈ వ్యవహారంపై మాట్లాడారు. ‘ప్రస్తుతం రష్దీ ఓ జీవచ్ఛవం. దాడికి పాల్పడిన యువకుడి ధైర్యమైన చర్యకు ధన్యవాదాలు. అతన్ని గౌరవించేందుకుగానూ సుమారు 1,000 చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని అతనికి, లేదా అతనికి సంబంధించిన వారికెవరికైనా విరాళంగా ఇస్తాం’ అని జరీ తెలిపారు.
గతేడాది ఆగస్టు 12న న్యూయార్క్లోని ఓ వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతున్న రష్దీపై.. ఓ యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అందరూ చూస్తుండగానే వేదికపైకి దూసుకొచ్చి దాడి చేసిన యువకుడిని.. న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హాది మతార్గా గుర్తించారు. అప్పట్లో అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులు.. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్(IRGC)కు సానుభూతిపరుడిగా గుర్తించారు.
1980ల్లో రష్దీ రచించిన ‘ది సాతానిక్ వెర్సెస్’ నవల వివాదాలకు కేంద్రబిందువైంది. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. 1988లోనే ఇరాన్ ఈ నవలను నిషేధించింది. అప్పట్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయనపై ఫత్వా సైతం జారీ చేశారు. అయితే, రష్దీపై ఇటీవల జరిగిన దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా