China: చైనా ఎడారిలో ఆపరేషన్ తైవాన్కు పదును..!
ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ యుద్ధం వైపు చూస్తుండగా.. చైనా మాత్రం మెల్లగా తైవాన్ ఆక్రమణకు అవసరమైన వ్యూహాలను సాధన చేస్తోంది. తైవాన్కు అండగా నిలిచే ప్రధాన దేశాలైన అమెరికా,
తైవాన్ ఆక్రమణ సమయంలో జపాన్, అమెరికాను అడ్డుకొనేందుకు సాధన
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ యుద్ధం వైపు చూస్తుండగా.. చైనా మాత్రం మెల్లిగా తైవాన్ ఆక్రమణకు అవసరమైన వ్యూహాలకు పదను పెడుతోంది. తైవాన్కు అండగా నిలిచే ప్రధాన దేశాలైన అమెరికా, జపాన్లను దెబ్బతీయడంపై దృష్టిపెట్టింది. ఈ విషయం ఇటీవల ప్లానెట్ ల్యాబ్ అనే ఓ సంస్థ చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధంలో పశ్చిమ దేశాలు, అమెరికా తలమునకలై ఉన్నప్పుడు డ్రాగన్ ఈ రకమైన యుద్ధ విన్యాసాలు చేయడం ఆందోళనకరంగా మారింది.
ఏం జరిగింది..?
చైనాలో షింజియాంగ్లోని ఓ ఎడారి ప్రాంతంలో జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్కు చెందిన ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్) తరహా నిర్మాణం చేపట్టడం సంచలనం సృష్టించింది. దీని డిజైన్ బోయింగ్ ఈ-767 తరహాలో ఉంది. రెండు ఇంజిన్లు ఉన్న ఈ తరహా విమానాలను కేవలం జపాన్ దళాలు మాత్రమే వినియోగిస్తున్నాయని సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ నిపుణులు థామస్ నిక్కీ ఏషియాకు వెల్లడించారు. ప్రస్తుతం టోక్యో వద్ద నాలుగు విమానాలు ఉన్నాయి. తైవాన్ ఆక్రమణ కోసం ప్రణాళికలను తయారు చేయడానికే జపాన్ అవాక్సుల కట్టడిపై సాధన చేస్తున్నట్లు భావిస్తున్నారు. తైవాన్లో సంక్షోభం తలెత్తిన సమయంలో ఈ విమానాలను కోల్పోతే నాన్సే దీవులపై నిఘా సాధ్యంకాదని జపాన్ ఆర్మీ మాజీ చీఫ్ కియోఫుమి ఐవాత తెలిపారు.
ఈ విమానాలను కూల్చగలదా..?
రణ క్షేత్రానికి సుదూరాల్లో ఉంటూనే ఈ విమానాలు.. అక్కడ ప్రత్యర్థి దళాల కదలికలను గుర్తించగలవు. హైఆల్టిట్యూడ్లో ‘ఈ-767’ విమానాలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో 9,000 కిలోటమీర్లు ప్రయాణించగలవు. ఈ రకం విమానాలను ఆకాశానికి కంట్రోల్ టవర్లుగా అభివర్ణిస్తుంటారు. ఈ విమానంపై డిస్క్ తరహా ఓ రాడార్ అమర్చి ఉంటుంది. సాధారణంగా భూమి పై ఉండే రాడార్ల కంటే.. అత్యధిక ఎత్తులో ఉండే ఈ రాడార్లు సుదూరాలపై నిఘా ఉంచగలవు. శత్రుదేశాల విమానాలు, క్షిపణుల రాకను సూదూరం నుంచే గుర్తించి వాటిని అడ్డుకొనేందుకు స్వదేశీ ఫైటర్ జెట్లకు మార్గదర్శకత్వం చేస్తాయి. ఈ-767 విమానాలను బోయింగ్ అభివృద్ధి చేసింది. 50 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 16 మీటర్ల ఎత్తుతో ఉంటాయి. ప్రపంచంలో జపాన్ మాత్రమే ఈ తరహా విమానాలను హమామట్సు ఎయిర్ బేస్లో వాడుతోంది.
ఈ విమానాలు గగనతలంలో ఉన్నప్పుడు కూల్చడం అంత తేలిక కాదు. కానీ, విమానం నేలపై నిలిపిన సమయంలో చాలా తేలిగ్గా దాడి చేయవచ్చు. బహుశ చైనా ఆ వ్యూహాన్నే సాధన చేస్తోందని మరో సైనిక నిపుణుడు వెల్లడించారు. క్షిపణి కచ్చితత్వాన్ని పరీక్షించడానికి నిలిపిన విమానం చుట్టూ మరికొన్ని వాహనాలను ఉంచారన్నారు.
జపాన్,అమెరికాలకు భయపెట్టేందుకు తాటాకు చప్పుళ్లు..
ఇటీవల చైనా.. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్ తరహా నిర్మాణం ఒకటి చేపట్టి.. దానిపై ఆయుధ పరీక్షలను నిర్వహించింది. ఇప్పుడు జపాన్ అవాక్స్ల కదలికలపై సాధన చేయడం దీనికి బలాన్నిస్తోంది. అమెరికా, జపాన్ దేశాలు వీటి ఉపగ్రహ చిత్రాలను తీస్తాయని చైనాకు తెలుసు. కానీ, చైనాతో తలపడితే ఏం జరుగుతుందో ఆ రెండు దేశాలకు తెలియజెప్పేందుకు ఇలా చేస్తోంది. అంతేకాదు.. తైవాన్కు చెందిన సువో నావికాదళ స్థావరాన్ని పోలిన కృత్రిమ నిర్మాణం కూడా చైనా చేపట్టింది. చైనా ఆక్రమణను అడ్డుకొనేందుకు ఈ స్థావరం తైవాన్కు అత్యంత కీలకమైంది.
చైనా అధినేతగా మూడోసారి షీజిన్పింగ్ బాధ్యతలు స్వీకరించాక తైవాన్ విలీనంపై దృష్టిపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికపై చైనా వ్యూహకర్తలు పనిచేస్తున్నారు. అదే సమయంలో శాంతియుతంగా ఈ విలీనం సాధ్యంకాకపోతే.. సైనిక శక్తిని వాడే అంశాన్ని చైనా కొట్టపారేయలేదు.
మేము తైవాన్ను కాపాడుతాం..: జోబైడెన్
చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే తాము తైవాన్ సైన్యాన్ని రక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సోమవారం టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తేల్చి చెప్పారు. తైవాన్ ఆక్రమణ అనేది ప్రమాదంతో చెలగాటమాడటమేనని ఆయన అభివర్ణించారు. వన్ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉంది.. దానిపై సంతకం చేసిందని బైడెన్ గుర్తు చేశారు. అలాగని తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకోవడం సరికాదని హెచ్చరించారు. తైవాన్కు రక్షణ విషయంలో ఆయన చాలా స్థిరంగా అమెరికా మద్దతు ఇస్తుందని చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?