Satya Nadella: జైన్ పుట్టిన క్షణాన.. ఆ రోజు ఏం జరిగిందంటే..: పుస్తకంలో పంచుకున్న సత్య నాదెళ్ల
జైన్ జన్మించిన సమయంలో వారికి ఎదురైన అనుభవాలు తమ జీవితాన్నే మార్చేశాయంటూ ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో ఈ విధంగా ప్రస్తావించారు.
‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో తనయుడు జైన్ గురించి ప్రస్తావన
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్లో పుట్టిన సత్య నాదెళ్ల.. ప్రపంచంలోనే దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ చీఫ్గా ఎదిగారు. అయితే, ఆ క్రమంలో తన వ్యక్తిగత జీవితం, మైక్రోసాఫ్ట్లో తన ప్రస్థానం, నూతన టెక్నాలజీ ఆవిష్కరణలతో పాటు ఇతర అనుభవాలను వివరిస్తూ ‘హిట్ రీఫ్రెష్’ పేరుతో కొన్నేళ్ల క్రితం ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తక ప్రచారంలో భాగంగా 2017లో భారత్లో పర్యటించిన నాదెళ్ల.. హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయానికి వచ్చి సహోద్యోగులతోనూ మాట్లాడారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్కు సీఈవోగా ఎదిగిన నాదెళ్ల.. తన కుమారుడు జైన్ మరణంతో తన జీవితంలో మరోసారి కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా జైన్ జన్మించిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలు తమ జీవితాన్నే మార్చేశాయంటూ ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో ఈ విధంగా ప్రస్తావించారు.
‘‘సాంకేతిక రంగాల్లో మా భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయం. ఇంజినీరింగ్ విభాగంలో నేను, ఆర్కిటెక్ట్గా అను (26) రాణిస్తోంది. ఇరు కుటుంబాలు సుదూరంగా భారత్లో ఉన్నప్పటికీ సియాటెల్లో మా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నాం. ఆ సమయంలో అను ప్రెగ్నెంట్. అప్పటికే మైక్రోసాఫ్ట్ క్యాంపస్కు సమీపంలోనే ఓ అపార్టుమెంటులో ఉంటున్న మేము.. తొలి సంతానం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. నర్సరీని అలంకరించడం, డెలివరీ తర్వాత వారాంతపు సెలవులు ఎలా మారుతాయో ఊహించుకుంటూ మధురమైన క్షణాలను గుర్తుచేసుకుంటూ ప్రణాళికలు రచించుకుంటున్నాం’’
ఊహించని పరిణామం మా జీవితాలనే మార్చేసింది..
‘‘గర్భవతిగా ఉన్న అను (36వ వారంలో)కు ఓ రాత్రి ఊహించని ఘటన ఎదురయ్యింది. శిశువులో ఇదివరకు మాదిరిగా కదలికలు లేవని అను గుర్తించింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటివరకు రొటీన్ పరీక్షలకే పరిమితమైన వైద్యులు.. ఎమర్జెన్సీ విభాగానికి మార్చారు. వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కేవలం మూడు పౌండ్లు (కిలోన్నర) మాత్రమే ఉన్న జైన్.. పుట్టిన తర్వాత ఎలాంటి శబ్దమూ (ఏడవడం) చేయలేదు’’
‘‘అనంతరం అక్కడ నుంచి జైన్ను సియాటెల్లోని చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించి ఎన్ఐసీయూలో ఉంచారు. అను కూడా ఆ ఊహించని పరిణామం నుంచి అప్పుడప్పుడే కోలుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆ రాత్రి మొత్తం అనుతోనే ఉన్నాను. మరుసటి రోజు ఉదయం సియాటెల్ వెళ్లి జైన్ని చూశాను. అలా రెండు, మూడేళ్లు గడిచాయి. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య తలెత్తడంవల్లే జైన్ ఆరోగ్యానికి హాని కలిగినట్లు తెలుసుకున్నాం. ‘సెరెబ్రల్ పాల్సీ’గా చెప్పే ఆ సమస్యకు వీల్ఛైర్, తల్లిదండ్రులపై ఆధారపడడం తప్పనిసరి అని తెలుసుకున్నాం’’ అంటూ తాము జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠోర సమయం గురించి సత్య నాదెళ్ల అందులో వివరించారు. ఇలా జైన్ జీవితంలో చాలా సమయం చిల్డ్రన్ ఆస్పత్రిలోనే కొనసాగింది. చివరకు సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!