Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు
ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు పడింది. ఇరాన్ అధ్యక్షుడిని సౌదీలో పర్యాటించాల్సిందిగా ఆహ్వానం అందింది.
ఇంటర్నెట్డెస్క్: ఇరాన్(Iran)-సౌదీ అరేబియా(Saudi Arabia) మధ్య చారిత్రాత్మక ఒప్పదం జరిగిన కొన్ని రోజుల్లోనే మరో అడుగు మందుకు పడింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని అధికారికంగా సౌదీలో పర్యటించాలంటూ ఆహ్వానం అందింది. ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ లేఖ అందినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ విషయాన్ని ఇరాన్ సీనియర్ అధికారి మహమ్మద్ జంషాది ట్విటర్లో పేర్కొన్నారు. సౌదీ ఆహ్వానంపై అధ్యక్షుడు రైసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్-సౌదీ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించడానికి అంగీకారం కుదరింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహైన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల కోసం మూడు వేదికలను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
సౌదీలో మహమ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్గత రాజకీయాలతోపాటు దౌత్యనీతిలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పటిదాకా చమురుపై అధికంగా ఆధారపడ్డ తమ దేశాన్ని... మునుముందు అన్నిరంగాల్లోనూ ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని రాజు భావిస్తున్నారు. ఇందుకోసం విజన్-2030 పేరిట ఓ ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలిక ఘర్షణలు, శత్రుత్వాలపట్ల కాసింత మెతకవైఖరి అవలంబించటం అందులో భాగంగా చెబుతున్నారు. అదే ఇరాన్తో దౌత్య ఒప్పందానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో చైనా మధ్య వర్తిత్వంతో ఇరాన్ -సౌదీ అరేబియా మధ్య మార్చి రెండో వారంలో ఒప్పందం జరిగింది. పరస్పరం దౌత్యకార్యాలయాలను తెరిచేందుకు అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణ దాదాపు ముగిసినట్లైంది. భవిష్యత్తులో బహ్రెయిన్తో కూడా సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని ఇరాన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..