oil output: సౌదీ నుంచి బైడెన్కు మరో షాక్..!
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయని సామెత ఉంది. కొన్ని నెలల క్రితం వరకు హుతి రెబల్స్ దాడి చేస్తున్నారు ఆయుధాలు ఇవ్వాలని సౌదీ అమెరికాకు విజ్ఞప్తి చేసింది.. కానీ, అమెరికా ఏవో సాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది..! కాలం మారింది.. చమురు సంక్షోభం భగ్గుమంది
అతితక్కువ చమురు ఉత్పత్తి పెంపు
ఇంటర్నెట్డెస్క్ప్రత్యేకం
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయని సామెత ఉంది. కొన్ని నెలల క్రితం వరకూ హుతి రెబల్స్ దాడి చేస్తున్నారు.. ఆయుధాలు ఇవ్వాలని సౌదీ అమెరికాకు విజ్ఞప్తి చేసింది.. కానీ, అమెరికా ఏవో సాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది..! కాలం మారింది.. చమురు సంక్షోభం భగ్గుమంది. దీంతో ఇంధన ఉత్పత్తి పెంచాలని అమెరికా సౌదీని కోరింది. దీనికి అంగీకరించి పెంచింది.. దాదాపు 40 ఏళ్ల అతితక్కువ పెంపు అదే కావడం అమెరికాను షాక్కు గురి చేసింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టడం ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభానికి ఆజ్యం పోసింది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పతాక స్థాయిలో 9శాతాన్ని దాటేసింది. మరికొన్నాళ్లలో అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలు ఉండటంతో బైడెన్ సర్కారులో కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తి పెంచడం దాని లక్ష్యంగా మారింది. కానీ, రష్యా బైడెన్ మాట వినదు.. ఇక కొద్దో గొప్పో వినేది సౌదీనే. ఈ నేపథ్యంలో ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన బైడెన్ చమురు ఉత్పత్తి పెంచడంపై అక్కడి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించారు.
86 సెకన్లకు సరిపడా చమురు ఉత్పత్తి పెంపు..?
అప్పటి వరకు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) పాలనలోని సౌదీని బైడెన్ కార్యవర్గం దూరం పెట్టింది. కానీ, చమురు కోసం ఒక్కసారిగా దగ్గరయ్యేందుకు చేసిన యత్నం పెద్దగా ఫలితం చూపించలేదు. సౌదీ నేతృత్వంలోని ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) బృందం కేవలం రోజుకు 1,00,000 పీపాల చమురు ఉత్పత్తి మాత్రమే పెంచాలని నిర్ణయించింది. ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో ఇది కేవలం 86 సెకన్ల డిమాండ్ను మాత్రమే తీర్చగలదని సీఎన్బీసీ కథనంలో పేర్కొంది. బైడెన్ కార్యవర్గానికి ఇదో పెద్దషాక్. అమెరికాలోనే 2021 లెక్కల ప్రకారం రోజువారీ చమురు వినియోగం 19.78 మిలియన్ పీపాలుగా ఉందంటే.. తాజా పెంపు ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. 1986 నుంచి అతి తక్కువ చమురు ఉత్పత్తి పెంపుగా ఇది నిలిచిందని వాషింగ్టన్కు చెందిన కన్సల్టెంట్ గ్రూప్ ర్యాపిడాన్ ఎనర్జీ అధ్యక్షుడు బాబ్ మెక్నల్లీ పేర్కొన్నారు. వాస్తవానికి జులై, ఆగస్టు నెలల్లో రోజుకు 6,48,000 పీపాల చమురు ఉత్పత్తి పెంచుతామని జూన్లో ఒపెక్ పేర్కొంది. తాజా పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం కూడా పేర్కొంది.
ఒపెక్ నిర్ణయాన్ని అమెరికా పత్రికలు బైడెన్ వైఫల్యంగా పేర్కొంటున్నాయి. ‘బైడెన్ కార్యవర్గానికి ఇదో చెంపపెట్టు’ అని సీఎన్ఎన్ విశ్లేషకుడు మాట్ స్మిత్ పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్టు కథనం వెల్లడించింది.
ఒపెక్ భేటీకి గంటల ముందే తాయిలాలు ఇచ్చినా..
ఒపెక్ దేశాల సమావేశానికి కొద్ది గంటల ముందే బైడెన్ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకొంది. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు కొన్ని నెలల నుంచి నిలిపివేసిన ఆయుధ విక్రయాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ ప్రకారం 5 బిలియన్ డాలర్లు విలువైన క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇతర పరికరాలు ఉన్నాయి. సౌదీలోని కీలక స్థావరాలను హుతి రాకెట్ల నుంచి కాపాడేందుకు వీలుగా 3 బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ క్షిపణులు, యూఏఈకి 2.2 బిలియన్ డాలర్లు విలువైన హైఆల్టిట్యూడ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను అందజేయనుంది. అత్యాధునిక థాడ్(థర్మల్ హైఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) గగనతల రక్షణ వ్యవస్థను విక్రయించనుంది. ఈ సందర్భంగా అమెరికా విడుదల చేసిన ప్రెస్నోట్లో కూడా ‘‘అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించడానికి, మిత్ర దేశానికి రక్షణ కల్పించడం ద్వారా అమెరికా భద్రతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విక్రయాలు గల్ఫ్లో రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి’’ అని పేర్కొన్నారు.
సౌదీ ఆయుధం చమురే..
సౌదీ అరేబియా చమురును అగ్రదేశాలపై ఆయుధంగా వాడటం ఇదేమీ కొత్త కాదు. 2020లో సౌదీ-రష్యా మధ్య చమురు ధరలపై విభేదాలు తలెత్తాయి. మార్చి నుంచి సౌదీ భారీ డిస్కౌంట్పై చమురును అమ్మడం మొదలు పెట్టింది. ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచింది. దీంతో గల్ఫ్ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంతగా ధరలు పతనం అయ్యాయి. ఏప్రిల్ మూడో వారంలో ఒక దశలో చమురు ధరలు నెగిటివ్కు వెళ్లిపోయాయి. దీనికి కొవిడ్ వ్యాప్తితో డిమాండ్ పతనం తోడైంది. రష్యా రూబుల్ ఈ దెబ్బకు భారీగా విలువ కోల్పోయింది. ఆ తర్వాత ఒపెక్ జోక్యంతో మళ్లీ ఇరు దేశాలు రాజీకి వచ్చి చమురు ఉత్పత్తిలో కోతలు విధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి