
World Bank: కరోనా వేళ స్కూళ్ల మూసివేతను సమర్థించలేం..!
పేర్కొన్న ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్
వాషింగ్టన్: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై కోలుకోలేని దెబ్బకొట్టింది. కొవిడ్ కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. పలు దేశాల్లో ఇంకా విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే పాఠశాలలను మూసివేయడాన్ని సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్ జేమీ సావెద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ఆయన.. కొత్త వేరియంట్లు వస్తే తప్పని పరిస్థితుల్లో మాత్రమే చివరి నిర్ణయంగా స్కూళ్ల మూసివేతను చేపట్టాలని సూచించారు.
పాఠశాలలు సురక్షితం కాదని, తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని సావెద్రా అన్నారు. బడులు తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పబ్లిక్ పాలసీ కోణంలో పిల్లలకు టీకాలు వేసేంత వరకు వేచి ఉండటం సమంజసం కాదని, దాని వెనుక ఎలాంటి శాస్త్రీయ కోణం లేదని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ‘బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లను తెరిచి.. పాఠశాలలను మూసివేయడంలో ఎలాంటి అర్థం లేదు. ఇలాంటి విషయాలను క్షమించలేము. బడులను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని పలు అధ్యయనాల్లో తేలింది. పిల్లలపై వైరస్ ప్రభావం కూడా తక్కువేనని వెల్లడైంది’ అని జేమీ సావెద్రా పేర్కొన్నారు.
2020కు సంబంధించి ‘బీటెన్ లేదా బ్రోకెన్? ఇన్ఫార్మాలిటీ, దక్షిణాసియాలో కరోనా’ పేరుతో ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం ఓ నివేదికను రూపొందించింది. ఒక దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మించి నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. స్కూళ్ల మూసివేత కారణంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సావెద్రా హెచ్చరించారు. పాఠశాలలు తెరుచుకోవడం వల్ల కేసులేమైనా పెరిగాయా? అనే విషయంపై అధ్యయనం చేపట్టగా అలా జరగలేదని తేలిందన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్స్టోక్స్ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్ప్రీత్ హాట్ స్టిల్!
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం