Ukraine Crisis: ఈ ఖాళీ స్ట్రోలర్స్ వెనుక.. కనిపించని కడుపుకోత..!
లివీవ్ ప్రాంతంలోని రినోక్ స్క్వేర్... నేతల యుద్ధకాంక్షకు చెల్లించుకున్న భారీ మూల్యానికి నిలువెత్తు నిదర్శనం. నిర్జీవంగా మారిన బిడ్డను తలుచుకుంటూ తల్లడిల్లుతోన్న తల్లుల కన్నీటికి సజీవ సాక్ష్యం.
కీవ్: లివీవ్ ప్రాంతంలోని రినోక్ స్క్వేర్... నేతల యుద్ధకాంక్షకు చెల్లించుకున్న భారీ మూల్యానికి నిలువెత్తు నిదర్శనం. నిర్జీవంగా మారిన బిడ్డలను తలుచుకుంటూ తల్లడిల్లుతోన్న తల్లుల కన్నీటికి సజీవ సాక్ష్యం. అక్కడ వరుసలు తీరిన స్ట్రోలర్స్.. ఈ ప్రపంచానికి వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. పుతిన్ను నిలువరించాలని రష్యన్ తల్లులను సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మూడు వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నడుస్తుండగా.. ఇన్ని రోజుల్లో ఎన్నో పసిప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ స్ట్రోలర్స్.. తల్లులు పడుతోన్న వేదనను ప్రపంచానికి చెప్తున్నాయి. ఈ సంతాప దృశ్యాలను లివీవ్ మేయర్ ఆండ్రియ్ సడోవియ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
‘109 మంది పసిబిడ్డలు. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది భయంకరమైన యుద్ధమూల్యం. ఉక్రెయిన్ పిల్లలను రక్షించుకునేందుకు, వారికి భవిష్యత్తును అందించేందుకు ఈ ప్రపంచంలోని పెద్దలంతా ఒక కవచంలా నిలవాలని మేం అభ్యర్థిస్తున్నాం’ అంటూ మేయర్ ఈ చిత్రాలను షేర్ చేశారు. ముక్కుపచ్చలారని ఆ 109 మంది చిన్నారుల మృతికి సంతాపంగా ఈ స్ట్రోలర్స్ను లివీవ్లోని రినోక్ స్క్వేర్ వద్ద ఉంచారు.
ఈ చిత్రాలను చూసి చలించని హృదయం లేదు. మీ పిల్లలు అలా స్ట్రోలర్స్లో తిరిగిన విషయాన్ని ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోండంటూ రష్యన్ తల్లులను కొందరు సూటిగా అడుగుతున్నారు. ‘ఆ చిన్నారులు చనిపోవడంతో ఇక స్ట్రోలర్లో ఉంచలేం. అక్కడ మీ పిల్లలున్నట్లు ఒక్క నిమిషం ఊహించుకోండి. మీ బిడ్డల పట్ల మీరెలా స్పందిస్తారో గుర్తు తెచ్చుకోండి. నేను ఇక ఖాళీ స్ట్రోలర్ను చూడదల్చుకోలేదు’ అని ఉక్రెయిన్ మహిళ ఒకరు తీవ్ర ఆవేదన చెందారు.
ఇదిలా ఉండగా.. ఈ దురాక్రమణ కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్తూ.. గాయపడిన చిన్నారులున్నారు. తమ శరీర భాగాలు కోల్పోయి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారున్నారు. వారికి చికిత్స అందించే క్రమంలో వైద్య సిబ్బందీ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇప్పటివరకూ 130 మంది పిల్లలు గాయపడి ఉంటారని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. దాడులు తీవ్రంగా ఉండటంతో వాస్తవ గణాంకాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.