Scotland: 48ఏళ్ల పోరాట ఫలితం.. తల్లి చెంతకు కుమారుడి అవశేషాలు..
పుట్టిన వారం రోజులకే ఆ శిశువు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ శిశువు అధికారులు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడంపై తల్లి అనుమానం వ్యక్తం చేసింది. చివరకు ఆమె అనుమానం నిజమవడంతో ఆందోళన వ్యక్తం చేసింది.
లండన్: అనారోగ్యంతో పుట్టిన ఓ మగ శిశువు (Infant).. వారానికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కన్నీరుమున్నీరైన ఆ మాతృమూర్తి చిన్నారిని కడసారిగా చూసుకోలేకపోయింది. అంత్యక్రియలు పూర్తి చేశామని అధికారులు చెప్పినప్పటికీ శంకించిన ఆమె.. కుమారుడి అవశేషాల కోసం పట్టుపట్టింది. చివరకు 48 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఆ చిన్నారి అవశేషాలను స్వాధీనం చేసుకోగలిగింది. స్కాట్లాండ్ (Scotland) మాతృమూర్తికి ఈ విషాద సంఘటన ఎదురైంది.
స్కాట్లాండ్కు చెందిన లైదియా రీడ్ (78) అనే మహిళ 1975లో ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ, పుట్టిన వారం రోజులకే ఆ శిశువు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ తల్లికి చెప్పిన అధికారులు.. అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. అంత్యక్రియలు హడావిడిగా చేయడంపై అనుమానం వ్యక్తంచేసిన ఆమెకు.. పరిశోధన కోసం తన కుమారుడి అవయవాలు తీసుకున్నారనే భయాందోళన ఎక్కువైంది. చివరకు అదే నిజమని తేలడంతో ఆ కన్నతల్లి మరింత కంగారు పడింది.
దీంతో తన బిడ్డ అవశేషాలు చూపెట్టాలని అధికారులను డిమాండ్ చేసింది. ఆమె ఒత్తిడితో అధికారులు మరో బిడ్డను చూపెట్టడంతో ఆమె అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇదే సమయంలో తాను అనారోగ్యానికి గురైనా.. పట్టు విడవకుండా వాటి కోసం అన్ని మార్గాల్లో సుదీర్ఘ పోరాటం కొనసాగించింది. ఈ క్రమంలో 2017లో కొంత ఊరట కలిగింది. కోర్టు అనుమతితో తన కుమారుడిదేనని అధికారులు చెప్పిన శవపేటికను బయటకు తీయించి చూడగా.. అందులో అసలు ఎలాంటి అవశేషాలూ లేకపోవడంతో కన్నపేగు కంగుతింది.
తన కుమారుడికి ఎలాగైనా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేపట్టాలన్న ఆమె తలంపునకు వ్యవస్థలు దిగివచ్చాయి. కుమారుడి అవశేషాల కోసం 48ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఆమెకు.. కుమారుడి అవశేషాలు అందించేందుకు క్రౌన్ ఆఫీస్ అధికారులు అంగీకరించారు. ఎడిన్బర్గ్లోని రాయల్ వయోవృద్ధుల పునరావాస వైద్యశాలలో భద్రపరిచిన ఆ శిశువు అవయవాలు, కొన్ని అవశేషాలను ఆ తల్లికి అందించడంతో ఆమె పోరాటం ఫలించినట్లయ్యింది. మరికొన్ని అవశేషాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని సమాచారం.
అయితే, పరిశోధన కోసం చిన్నారుల అవయవాలను స్కాట్లాండ్ ఆస్పత్రుల్లో భద్రపరిచడం ఎంతో కాలంగా సాగుతోందనే విషయం తాజా ఘటనతో మరోసారి రుజువయ్యింది. మీడియా కథనాల ప్రకారం, 1970-2000 మధ్యకాలంలో అక్కడి ఆస్పత్రుల్లో సుమారు 6వేల అవయవాలు, కణజాలాలను భద్రపరిచారని వెల్లడైంది. దీనిపై దర్యాప్తు జరిపిన నేషనల్ హెల్త్ సర్వీస్.. చివరకు వాస్తవాలను అంగీకరించాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.