Ukraine Crisis: అమెరికా నేరుగా మాతో యుద్ధానికి దిగుతోంది: రష్యా
ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యా.. తాజాగా అగ్రరాజ్యంపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్లో సైనిక కార్యకలాపాలను అమెరికా సమన్వయం చేస్తోందని.......
మాస్కో: ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యా.. తాజాగా అగ్రరాజ్యంపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్లో సైనిక కార్యకలాపాలను అమెరికా సమన్వయం చేస్తోందని, ఈ చర్య రష్యాతో నేరుగా సైనిక చర్యలో పాల్గొన్నట్లేనని సీనియర్ చట్టసభ్యుడు వ్యచెస్లామ్ వొలోదిన్ పేర్కొన్నారు. ‘కీవ్లో సైనిక కార్యకలాపాలను వాషింగ్టన్ సమన్వయం చేస్తూ, సైనిక పరిస్థితులను మెరుగుపరుస్తోంది. తద్వారా రష్యాకు వ్యతిరేకంగా సైనిక చర్యలలో నేరుగా పాల్గొంటోంది’ వొలోదిన్ తన టెలిగ్రామ్ ఛానెల్లో రాసుకొచ్చారు.
ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలైనప్పటి నుంచీ బాధిత దేశానికి అగ్రరాజ్యం అండగా నిలుస్తూనే వస్తోంది. సైనిక బలగాల పరంగా ఉక్రెయిన్కు కావాల్సిన పూర్తి మద్దతు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. యుద్ధ ట్యాంకులు, ఇతర పేలుడు పదార్థాలను అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్కు 800 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించడంతో ఆ దేశ ఆయుధాల సంఖ్య, స్థాయి భారీగా పెరిగిపోయింది. 40,000 శతఘ్ని గుండ్లు, శతఘ్నులు, 11 ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
ఉక్రెయిన్కు మరో 3,300 కోట్ల డాలర్ల సాయం అందించడానికి అనుమతించాలని అమెరికన్ కాంగ్రెస్ను బైడెన్ గత నెలాఖరులో కోరారు. ఉక్రెయిన్కు మరింత కాలం సాయమందించే ఉద్దేశం అమెరికాకు ఉందన్న సంకేతాన్ని ఆయన వెలువరించారు. సైనిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఆర్థిక, మానవతా సాయానికి ఈ మొత్తం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. రష్యా కుబేరుల ఆస్తుల్ని జప్తు చేయడానికి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉక్రెయిన్కు సాయంగా వాడేందుకు అనుమతించాలని కాంగ్రెస్ను బైడెన్ కోరారు. మార్చిలో మొత్తంగా 1,360 కోట్ల డాలర్ల సాయానికి ఆమోదం లభించగా ఆ మొత్తమంతా దాదాపు ఖర్చయిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ