Covid: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు..!
చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ను నేడు మరోసారి పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ సారి నగరంలోని 2.5 కోట్ల మంది జనాభా మొత్తం కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్డెస్క్: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ను నేడు మరోసారి పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ సారి నగరంలోని 2.5 కోట్ల మంది జనాభా మొత్తం కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు. కానీ, తాజాగా నగరం మొత్తం కఠిన ఆంక్షలను విధించారు. కానీ, తాజా నిర్ణయం నగరం మొత్తానికి వర్తించనుంది. చైనా ఆర్థిక రాజధానిగా పేరున్న ఈ నగరంపై కరోనా వైరస్ పంజా విసరడంతో రోజువారీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. దీంతో ఇక్కడి వారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకొంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు ఆన్లైన్లోనే ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
షాంఘైలో వైరస్ వ్యాప్తి చైనా జీరోకోవిడ్ వ్యూహాం సత్తాను పరీక్షిస్తోంది. వైరస్ వ్యాప్తి పెరిగే కొద్దీ నిబంధనలు కఠినంగా మారుతుండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా దేశాలు అనుసరిస్తున్న వాస్తవిక దృక్పథానికి భిన్నంగా చైనా జీరోకోవిడ్ పాలసీని ఎంచుకొంది. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ తేలిగ్గా వ్యాపిస్తుండటంతో వైరస్ కట్టడిలోకి రావడంలేదు. ప్రస్తుతం నగరంలో వైరస్ను కట్టడి చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.