
Shanghai: వామ్మో చైనా ‘సైలెంట్ పీరియడ్’..!
కఠిన ఆంక్షల దిశగా షాంఘై
ఇంటర్నెట్డెస్క్: జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చైనాలోని షాంఘై నగరం అత్యంత కఠిన ఆంక్షలకు తెరతీసింది. మరికొన్ని రోజులు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఆహారం కొనుగోళ్లకు, వైద్యశాలలకు వెళ్లేందుకు కూడా వీధుల్లోకి వచ్చేందుకు అనుమతించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నగరంలో విధించిన లాక్డౌన్ సమయంలో అమలు చేస్తోన్న అత్యంత కఠినమైన ఆంక్షలు ఇవే. నగరంలో ఈ ప్రాంతాల్లో ఆహార సరఫరా సేవలను కూడా నిలిపేయాలని నిర్ణయించింది. వైద్యశాలల్లో కూడా ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే తొలి ప్రాధాన్యమివ్వనుంది. అంతేకాదు.. కొవిడ్ సోకిన వ్యక్తుల పొరుగువారు, సన్నిహితులను కూడా గవర్నమెంట్ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కొవిడ్ ఆంక్షలు విధించి ఏడు వారాలు అవుతోంది. కొవిడ్ నిర్దారించిన కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో అధికారులు మాత్రం తమ లక్ష్యంగా ఉన్న ‘సొసైటల్ జీరో’ను అందుకోలేకపోతున్నారు. క్వారంటీన్లో ఉన్న వారిలో తప్ప బయట ఎక్కడా కొత్త కొవిడ్ కేసు రాకూడదనేది ‘సొసైటల్ జీరో’ లక్ష్యం. మరోవైపు కఠిన ఆంక్షలను షాంఘై అధికారులు సమర్థించుకొన్నారు. నగరంలోని సగం ప్రాంతాలకు నిబంధనల నుంచి విముక్తి లభించిందని చెబుతున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది నగరంలోని కీలక ప్రాంతాలకు వెళ్లి కలిసి ఫొటోలు దిగిన చిత్రాలను చైనా మీడియా ప్రచారం చేస్తోంది.
చైనా షాంఘైలో ‘సైలెంట్ పీరియడ్’ పేరిట కఠిన ఆంక్షలను విధిస్తోంది. దీనిని వచ్చే మూడు రోజులు అమలు చేయనుంది. దీనిలో కేవలం ప్రభుత్వ ఆహార సరఫరాలను మాత్రమే అనుమతిస్తారు. స్థానికులు ఎవరూ గడపదాటి బయటకు రాకూడదు.. అంతేకాదు ఎమర్జెన్సీ కేసులు కాకుండా ఎవరైనా వైద్యశాలలకు వెళ్లాలంటే కమిటీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి.
కొవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని బలవంతంగా సెంట్రల్ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఇళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఇంటి తాళాలను తలుపుల వద్ద ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై స్థానికుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఆన్లైన్ పోస్టులు చేసినా.. ఆ తర్వాత వాటిని తొలగిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
bagless days: అక్కడి స్కూళ్లలో విద్యార్థులకు ఇక ప్రతి ‘శనివారం ప్రత్యేకమే’!
-
World News
UK: బోరిస్ రాజీనామా వేళ.. బ్రిటన్ నూతన ప్రధాని ఎన్నిక ఎలా జరుగుతుంది..?
-
Technology News
Nothing Phone (1): ఐఫోన్ కంటే తక్కువ ధరకే ‘నథింగ్ ఫోన్ 1’.. ఎంతంటే?
-
Movies News
Gargi: సాయి పల్లవి న్యాయపోరాటం.. ‘గార్గి’ ట్రైలర్ వచ్చేసింది!
-
General News
Andhra News: విజయవాడలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు... చెన్నై, విశాఖ ఎలా వెళ్లాలంటే?
-
World News
Boris Johnson: వివాదాల బోరిస్ జాన్సన్.. ‘బ్రిటన్ డొనాల్డ్ ట్రంప్’..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Rahul Dravid : బజ్బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!