Shanghai Lockdown: ఊపిరి పీల్చుకుంటోన్న షాంఘై.. లాక్డౌన్ ఆంక్షల సడలింపు
గత ఆరు వారాలుగా ఆంక్షల గుప్పిట్లో ఉండిపోయిన షాంఘై నగరంలో కరోనా ఉద్ధృతి ప్రస్తుతం అదుపులోకి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో ఎత్తివేత
షాంఘై: కరోనా వైరస్ విజృంభణతో చైనా ఆర్థిక నగరం షాంఘై వణికిపోయిన సంగతి తెలిసిందే. వైరస్ కట్టడికి కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో ఆహారం, నిత్యావసరాల కొరతతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. దాదాపు ఆరు వారాలుగా ఆంక్షల గుప్పిట్లో ఉండిపోయిన షాంఘై నగరంలో కరోనా ఉద్ధృతి ప్రస్తుతం అదుపులోకి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నేటి నుంచి పలు జిల్లాల్లో ఆంక్షలను సడలించిన అధికారులు.. జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు.
ఒమిక్రాన్ వేరియంట్ విస్తృత వ్యాప్తితో రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘై నగరం మార్చి చివరి వారంలో లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నా కొద్ది ఆంక్షలను పొడగిస్తూ వస్తోంది. అయితే, కొవిడ్ వ్యాప్తి కట్టడికి తీసుకున్న చర్యలతో వైరస్ విజృంభణ తగ్గినట్లు షాంఘై అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఆంక్షలను సడలించామన్న నగర మేయర్.. ప్రస్తుతం 10లక్షల మంది మాత్రమే కఠిన లాక్డౌన్లో ఉన్నారని వెల్లడించారు. దీంతో జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.
గత ఆరు వారాలుగా పూర్తి లాక్డౌన్లో కొనసాగిన షాంఘైలో సోమవారం నుంచి సూపర్ మార్కెట్లు, మాల్స్, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించారు. అయితే, రైలు సబ్వేలను పూర్తిగా మూసినవేసిన అధికారులు.. ఇతర ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరి చేశారు. ఇలా గత యాభై రోజులుగా ఇళ్లకే పరిమితమైన షాంఘైవాసులకు ఆంక్షల నుంచి బయటపడేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలాఉంటే, చైనాలో సోమవారం నాడు కొత్తగా 1159 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా షాంఘైలోనే వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. అటు రాజధాని బీజింగ్లోనూ నిత్యం పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం రోజున 54 కేసులు రికార్డయ్యాయి. దీంతో కరోనా నిర్ధారణయైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు చేయడంతోపాటు ఆంక్షలు విధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
లైంగిక నేరారోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్(72)కు ఓ కేసులో ఊరట లభించింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?