pakistan: నా మాజీ భార్య .. వారు చెప్పినట్లు ఆడుతోంది..
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాజీ భార్యలు రేహమ్ ఖాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె షరీఫ్ కుటుంబం చెప్పినట్లు ఆడుతున్నారని పేర్కొన్నారు.
షరీఫ్ కుటుంబంపై ఇమ్రాన్ ఆరోపణలు
ఇంటర్నెట్డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాజీ భార్య రేహమ్ ఖాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె షరీఫ్ కుటుంబం చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పుస్తకం రాసేలా రేహమ్ఖాన్కు నవాజ్ షరీఫ్ కుటుంబం సొమ్ములు చెల్లించిందని పేర్కొన్నారు. ముల్తాన్లోని ఓ సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు వారు ఏదో ఒకటి విడుదల చేస్తారని ఆరోపించారు. 2018లో రేహమ్ ఖాన్ పుస్తకం ప్రచురించాక తొలిసారి ఇమ్రాన్ దానిపై ఆరోపణలు చేశారు. ‘‘కొందరు ఉన్నారు.. వారు నాకు వ్యతిరేకంగా పుస్తకం రాసేందుకు ఓ మహిళకు సొమ్ములు చెల్లించారు. వారు మరోసారి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను వారికి ఒకటి చెప్పదలుచుకొన్నా. నా కంఠంలో ప్రాణం ఉన్నన్నాళ్లూ పోరాడుతాను’’ అని పేర్కొన్నారు.
తన తొలి భార్య జమైమా గోల్డ్ స్మిత్ విషయాన్ని కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు. షరీఫ్ మనుషులు ఆమెను యూదు లాబీ వ్యక్తిగా చిత్రీకరించారని ఇమ్రాన్ చెప్పారు. షాబాజ్ షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్గా ఉన్న సమయంలో చాలా ఎన్కౌంటర్లకు ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. షాబాజ్ ప్రభుత్వాన్ని ‘ఇంపోర్టెడ్ గవర్నమెంట్’తో పోలుస్తూ తాను చేసిన ఆరోపణలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. విదేశీ శక్తులు అవినీతి ప్రభుత్వాలను పాక్ ప్రజలపై రుద్దుతున్నాయని పేర్కొన్నారు. ఇస్లామాబాద్లో 20 లక్షల మందితో సభ ఏర్పాటుచేసి ఎన్నికలకు డిమాండ్ చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం