Shinzo Abe: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కంటే.. షింజో అబె వీడ్కోలుకు అధిక ఖర్చు!
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమంలో ఈనెల 27 తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని హంగులతో జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది..........
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమం ఈనెల 27 తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని హంగులతో జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా పేర్కొంటోంది. ఇది ఈమధ్యే ముగిసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అయిన ఖర్చు కంటే అధికం. ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపు 1.3 బిలియన్ల యెన్లు ఖర్చుచేసినట్లు సమాచారం.
అబె సంస్మరణ సభ నిర్వహించే కాంట్రాక్ట్ను టోక్యోకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ మురయామాకు అప్పగించారు. అయితే, ప్రభుత్వం ఎందుకు అంత ఖర్చు చేస్తోందంటూ ఈ కార్యక్రమాన్ని చాలా మంది జపనీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభపై నిరసన తెలుపుతూ ప్రధాని ఫుమియో కిషిడా కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్నాడు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం.. సంస్మరణ సభ అంచనా వ్యయం 250 మిలియన్ యెన్లుగా జపాన్ ప్రభుత్వం మొదట పేర్కొంది. ఇదిలా ఉంటే, ముఖ్య క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మాట్సునో ప్రకారం.. ఈవెంట్ పోలీసింగ్ కోసం దాదాపు 800 మిలియన్ యెన్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు 600 మిలియన్ యెన్లు ఖర్చుకానున్నట్లు అంచనా వేశారు. ఈ బిల్లు మొత్తంగా 1.7 బిలియన్ యెన్లకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు.
జపాన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన అబె.. జులైలో హత్యకు గురయ్యారు. నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అబె వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ నిర్వహిస్తోన్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమమిది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.