USA: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తుపాకీ.. ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెనెస్సీలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు.
అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెనెస్సీ నాష్విల్లేలో ఉన్న ఓ ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాలలో ఓ సాయుధ యువతి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. తుపాకీ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో సదరు టీనేజ్ యువతి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10.13 గంటలకు చోటుచేసుకుంది. కాల్పులు విషయం తెలియగానే పోలీసులు ఆ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకుని బాధితులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది ఒకరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన యువతి నుంచి రెండు రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితురాలు ఎవరో ఇంతవరకు గుర్తించలేదు. ఈ ఘటన జరిగిన కొవెనంట్ ప్రీ-స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ 12 ఏళ్లలోపు వారే. ఈ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.