North Korea: అనూహ్యంగా జ్వరం వ్యాప్తి.. ఆరుగురు మృతి..!
తన దేశంలో కరోనా మొదటి కేసు గురించి ఉత్తర కొరియా అలా ప్రకటన చేసిందో లేదో అప్పుడే మరణాల లెక్క బయటకు వచ్చింది.
కొవిడ్పై ప్రకటన వెంటనే ఉ.కొరియాలో మరణాలు నమోదు
మొదటిసారి మాస్క్లో దర్శనమిచ్చిన కిమ్
ప్యాంగ్యాంగ్: తన దేశంలో కరోనా మొదటి కేసు గురించి ఉత్తర కొరియా అలా ప్రకటన చేసిందో లేదో అప్పుడే మరణాల లెక్క బయటకు వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరం బారిన పడటంతో ఆరుగురు మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. అనూహ్యంగా జ్వరం వ్యాపించడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. మరోపక్క ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి మాస్క్లో దర్శనమిచ్చారు.
స్థానిక వార్త సంస్థ లెక్కల ప్రకారం.. 1,87,800 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. వారందరూ జ్వరం వల్ల అక్కడ చేరాల్సి వచ్చింది. అయితే అంతమంది అనారోగ్యానికి గురికావడానికి మూలం ఏంటో తెలియాల్సి ఉందని పేర్కొంది. ఏప్రిల్ చివరి నుంచి ఈ వ్యాప్తి జరుగుతున్నట్లు చెప్పింది. ఇప్పటివరకూ 3,50,000 మంది జ్వరం బారినపడగా.. 1,62,200 మంది కోలుకున్నారు. ఆరుగురు మృతుల్లో ఒకరిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు తెలిపింది.
మొదటి సారి మాస్క్ ధరించిన కిమ్..
మొదటి కరోనా కేసు గురించి ప్రకటన తర్వాత.. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాస్క్ ధరించి కనిపించారు. ఈ రెండేళ్లకాలంలో ప్రపంచమంతా కరోనా వేవ్లతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పటినుంచి ప్రతిఒక్కరికీ మాస్కే ప్రధాన రక్షణ కవచంగా నిలిచింది. ఇంతకాలం తమ దేశంలో కరోనా అడుగుపెట్టలేదని గర్వంగా చెప్పిన ఆయన ఎక్కడా మాస్క్ పెట్టుకున్న దాఖలాలు లేవు. తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై జరిపిన సమావేశంలో కిమ్ సహా అధికారులంతా మాస్కులు పెట్టుకున్నారు. ఇక మహమ్మారి కారణంగా ఆ దేశంలో ఇప్పుడు తీవ్రస్థాయి జాతీయ అత్యయిక స్థితి అమల్లో ఉంది. అతి స్వల్ప కాలంలో కరోనా మూలాన్ని గుర్తించి, దానికి పారదోలేందుకు కిమ్ ప్రతిజ్ఞ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం