
North Korea: అనూహ్యంగా జ్వరం వ్యాప్తి.. ఆరుగురు మృతి..!
కొవిడ్పై ప్రకటన వెంటనే ఉ.కొరియాలో మరణాలు నమోదు
మొదటిసారి మాస్క్లో దర్శనమిచ్చిన కిమ్
ప్యాంగ్యాంగ్: తన దేశంలో కరోనా మొదటి కేసు గురించి ఉత్తర కొరియా అలా ప్రకటన చేసిందో లేదో అప్పుడే మరణాల లెక్క బయటకు వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరం బారిన పడటంతో ఆరుగురు మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. అనూహ్యంగా జ్వరం వ్యాపించడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. మరోపక్క ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి మాస్క్లో దర్శనమిచ్చారు.
స్థానిక వార్త సంస్థ లెక్కల ప్రకారం.. 1,87,800 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. వారందరూ జ్వరం వల్ల అక్కడ చేరాల్సి వచ్చింది. అయితే అంతమంది అనారోగ్యానికి గురికావడానికి మూలం ఏంటో తెలియాల్సి ఉందని పేర్కొంది. ఏప్రిల్ చివరి నుంచి ఈ వ్యాప్తి జరుగుతున్నట్లు చెప్పింది. ఇప్పటివరకూ 3,50,000 మంది జ్వరం బారినపడగా.. 1,62,200 మంది కోలుకున్నారు. ఆరుగురు మృతుల్లో ఒకరిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు తెలిపింది.
మొదటి సారి మాస్క్ ధరించిన కిమ్..
మొదటి కరోనా కేసు గురించి ప్రకటన తర్వాత.. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాస్క్ ధరించి కనిపించారు. ఈ రెండేళ్లకాలంలో ప్రపంచమంతా కరోనా వేవ్లతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పటినుంచి ప్రతిఒక్కరికీ మాస్కే ప్రధాన రక్షణ కవచంగా నిలిచింది. ఇంతకాలం తమ దేశంలో కరోనా అడుగుపెట్టలేదని గర్వంగా చెప్పిన ఆయన ఎక్కడా మాస్క్ పెట్టుకున్న దాఖలాలు లేవు. తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై జరిపిన సమావేశంలో కిమ్ సహా అధికారులంతా మాస్కులు పెట్టుకున్నారు. ఇక మహమ్మారి కారణంగా ఆ దేశంలో ఇప్పుడు తీవ్రస్థాయి జాతీయ అత్యయిక స్థితి అమల్లో ఉంది. అతి స్వల్ప కాలంలో కరోనా మూలాన్ని గుర్తించి, దానికి పారదోలేందుకు కిమ్ ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు
-
India News
Mamata Banerjee: ‘కాళీ’ వివాదం.. మమత కీలక వ్యాఖ్యలు..!
-
Sports News
Rishabh Pant: పంత్ ఓపెనర్గా వస్తే..విధ్వంసమే : గావస్కర్
-
India News
bagless days: అక్కడి స్కూళ్లలో విద్యార్థులకు ఇక ప్రతి ‘శనివారం ప్రత్యేకమే’!
-
World News
UK: బోరిస్ రాజీనామా వేళ.. బ్రిటన్ నూతన ప్రధాని ఎన్నిక ఎలా జరుగుతుంది..?
-
Technology News
Nothing Phone (1): ఐఫోన్ కంటే తక్కువ ధరకే ‘నథింగ్ ఫోన్ 1’.. ఎంతంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Rahul Dravid : బజ్బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!